News October 8, 2024
జగన్.. రూ.కోటి సాయం ఎవరికిచ్చారో చెప్పాలి: బుద్దా

AP: వరదల సమయంలో ప్రజలను చంద్రబాబు ఆదుకున్న తీరు దేశానికే ఆదర్శమని TDP నేత బుద్దా వెంకన్న అన్నారు. వరదలను అడ్డుపెట్టుకుని దోపిడీ చేశారంటూ YCP నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. దమ్ముంటే ఈ అంశంపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. వరదలప్పుడు ఏసీ గదిలో కూర్చున్న జగన్ ఇప్పుడు పేదల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన ప్రకటించిన రూ.కోటి సాయం ఎవరికి ఖర్చు పెట్టారో చెప్పాలన్నారు.
Similar News
News July 7, 2025
‘నీకు మతి ఉండే నా తలరాత రాశావా?’ అని దేవుడికి లేఖ రాసి..

TG: వేములవాడకు చెందిన దీటి రోహిత్(23) ఆత్మహత్యకు ముందు దేవుడి(శివుడు)కి రాసిన లేఖ కదిలిస్తోంది. ‘నీకు మతి ఉండే నా తలరాత రాశావా? నీ కొడుకు తలరాత అలా రాయలేదే! మేం కొడుకులం కాదా?’ అని ప్రశ్నించాడు. ‘బెస్ట్ సూసైడ్ లెటర్ రాయాలన్న నా కోరిక ఇప్పుడు నెరవేరింది. మరో జన్మ వద్దు’ అంటూ రాసుకొచ్చాడు. కుటుంబ పరిస్థితుల వల్ల డాక్టర్ అవ్వాలన్న తన కోరిక తీరకపోవడంతోనే రోహిత్ బలవన్మరణానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది.
News July 7, 2025
ఇండియన్ ముస్లింలు బందీలు.. సిటిజన్లు కాదు: ఒవైసీ

మైనార్టీలకే ఎక్కువ బెనిఫిట్స్, రక్షణలు ఉన్న ఏకైక దేశం ఇండియానే అని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు చేసిన ట్వీట్పై AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఫైరయ్యారు. అవి తమ హక్కులని, చారిటీ కాదని ట్వీట్ చేశారు. ‘మీరు మంత్రి.. చక్రవర్తి కాదు. పాకిస్థానీ, బంగ్లాదేశీ, జీహాదీ, రోహింగ్యా అని పిలిపించుకోవడం బెనిఫిట్ అంటారా? ఇండియన్ మైనారిటీలు కనీసం సెకండ్ క్లాస్ సిటిజన్స్ కూడా కాదు. మేము బందీలం’ అని వ్యాఖ్యానించారు.
News July 7, 2025
అందుకే ఇన్నింగ్స్ డిక్లేర్ చేశా: ముల్డర్

జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్టులో 400 కొట్టి లారా రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉన్నా SA కెప్టెన్ ముల్డర్(367*) ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. దాని వెనుకున్న కారణాన్ని ఆయన బయటపెట్టారు. ‘గెలవడానికి సరిపడా స్కోర్ చేశామని భావించాం. లారా ఒక లెజెండ్. ఆ రికార్డు అలాగే ఉండేందుకు ఆయన అర్హులు. మళ్లీ ఛాన్స్ వచ్చినా ఇదే నిర్ణయం తీసుకుంటా. కోచ్ శుక్రీ కూడా ఇదే అన్నారు’ అని వ్యాఖ్యానించారు.