News February 4, 2025
పార్టీ నేతలతో జగన్ కీలక సమావేశం

AP: YCP అధినేత YS జగన్ ఆ పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, తదితరులు హాజరయ్యారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు జగన్ హాజరు కావాలా? వద్దా? అని అంశమూ చర్చకు వచ్చినట్లు సమాచారం. భేటీ అనంతరం YCP భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.
Similar News
News November 23, 2025
ఆరేళ్ల తర్వాత భారత్లో సెంచరీ.. ముత్తుసామి రికార్డ్

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో డెబ్యూ సెంచరీ చేసిన ముత్తుసామి(109) పలు రికార్డులను సాధించారు. ఆరేళ్ల తర్వాత భారత గడ్డపై ఏడు లేదా అంతకంటే దిగువన బ్యాటింగ్కు దిగి సెంచరీ చేసిన SA ప్లేయర్గా నిలిచారు. చివరిసారిగా 2019లో డికాక్ శతకం బాదారు. అలాగే భారత్, పాక్, బంగ్లాదేశ్లలో 50+ స్కోర్లు చేసిన నాలుగో సౌతాఫ్రికా ఆటగాడిగానూ ఘనత సాధించారు. బవుమా, బౌచర్, గ్రేమ్ స్మిత్ మాత్రమే గతంలో ఈ ఫీట్ నమోదు చేశారు.
News November 23, 2025
తీవ్ర అల్పపీడనం.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

AP: దక్షిణ అండమాన్ సముద్రంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని APSDMA వెల్లడించింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ రేపటికి వాయుగుండంగా, ఆ తర్వాత 2 రోజుల్లో తుఫానుగా బలపడనుందని తెలిపింది. దీని ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఆవర్తన ప్రభావంతో మంగళవారం నాటికి మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని వివరించింది.
News November 23, 2025
వ్యవసాయ నిధి ఏర్పాటు అత్యవసరం.. IBSA నాయకులతో మోదీ

జొహనెస్బర్గ్లో జరుగుతున్న G20 సమ్మిట్లో IBSA (ఇండియా-బ్రెజిల్-సౌతాఫ్రికా) నాయకులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా ద సిల్వాలకు IBSA డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్, IBSA ఫండ్ ఫర్ క్లైమేట్ రెసిలియెంట్ అగ్రికల్చర్ ఏర్పాటు ప్రాముఖ్యతను వివరించారు. 40 దేశాల్లో విద్య, హెల్త్, మహిళా సాధికారతకు IBSA ఇస్తున్న మద్దతును ప్రశంసించారు.


