News April 6, 2024
ప్రతీ పేదవాడి గుండెల్లో జగన్: మంత్రి గుడివాడ

ఏపీలోని ప్రతీ పేదవాడి గుండెల్లో వైఎస్ జగన్ ఉన్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ‘వచ్చే ఎన్నికల్లో జగన్కే ఓటేయాలని అందరూ అనుకుంటున్నారు. జగన్ను సీఎం చేసేందుకు నేనేమైనా చేస్తా. సీఎం రమేశ్ నాన్ లోకల్. ఎంపీ నిధుల నుంచి ఆయన అనకాపల్లిలో రూపాయైనా ఖర్చు చేశారా? ఆయన ఇక్కడ గెలవరు. ఎన్నికల తర్వాత రమేశ్ చెవిలో పువ్వు పెట్టుకుని వెళ్లిపోవడమే’ అని అమర్నాథ్ దుయ్యబట్టారు.
Similar News
News December 2, 2025
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.280 తగ్గి రూ.1,30,200కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.250 పతనమై రూ.1,19,350 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.1,96,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News December 2, 2025
గొర్రెలకు సంపూర్ణ ఆహారం ఎలా అందుతుంది?

గొర్రెలకు మాంసకృత్తులు, క్రొవ్వు పదార్థాలు, ఖనిజ లవణాలు, పిండి పదార్థాలు, విటమిన్లతో కూడిన సంపూర్ణ దాణా(ఆహారం) అందేలా జాగ్రత్త వహించాలి. అప్పుడే గొర్రె మందలు ఆరోగ్యంగా పెరుగుతాయి. మంచి దాణా వల్ల గొర్రెల్లో పునరుత్పత్తి సామర్థ్యం పెరిగి వాటి మందలు వృద్ధిచెంది, పెంపకందారులకు అధిక ఆదాయం అందిస్తాయి. సరైన పోషకాహారం అందని తల్లి గొర్రెల వద్ద పిల్లలకు సరిపోను పాలుండకపోతే పిల్లలు సరిగా ఎదగక మరణిస్తాయి.
News December 2, 2025
CTETకు దరఖాస్తు చేశారా?

CTET అర్హత కోసం అభ్యర్థుల నుంచి CBSE దరఖాస్తులు కోరుతోంది. B.Ed, D.Ed, B.EI.Ed, D.Ed, D.EI.Ed అర్హతగల వారు DEC 18 వరకు అప్లై చేసుకోవచ్చు. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, ఏకలవ్య స్కూల్స్, రాష్ట్ర స్థాయిలో టీచర్ ఉద్యోగాలకు పోటీపడాలంటే CTET ఉత్తీర్ణత తప్పనిసరి. FEB 8న పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1000, రెండు పేపర్లకు రూ.1200. SC/ST/ PWBDలకు రూ.500, రెండు పేపర్లకు రూ.600. ctet.nic.in/


