News March 17, 2024

ఇసుకలో జగన్ రూ.40వేల కోట్ల స్కామ్: పవన్

image

AP: ఇసుక తవ్వకాలతో సీఎం జగన్ బినామీలు రూ.40వేల కోట్లు దోచేశారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. దీనిపై ప్రశ్నించిన జర్నలిస్టును చంపేశారని ఆరోపించారు. ‘రాష్ట్రం డ్రగ్స్‌కు రాజధాని అయిపోయింది. ఇక్కడ 30వేల మందికిపైగా మహిళలు అదృశ్యమయ్యారు. దీనిపై ప్రభుత్వం ఒక్కసారీ స్పందించలేదు. రాష్ట్రం నుంచి కంపెనీలు తరలిపోతున్నాయి. పారిశ్రామిక ప్రగతి దిగజారిపోయింది’ అని ఆరోపించారు.

Similar News

News November 19, 2025

50 మంది మావోయిస్టులను అరెస్టు చేశాం: లడ్డా

image

AP: రాష్ట్రంలో ఇప్పటివరకు 50 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నామని ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేశ్ చంద్ర లడ్డా వెల్లడించారు. ‘ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో అరెస్టులు జరిగాయి. భారీగా ఆయుధాలు కూడా సీజ్ చేశాం. నిన్న మారేడుమిల్లి ఎన్‌కౌంటర్ తర్వాత కొందరు మావోయిస్టులు పారిపోయారు. ఛత్తీస్‌గఢ్/తెలంగాణ నుంచి ఏపీకి రావడానికి మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారు’ అని తెలిపారు.

News November 19, 2025

వంటింటి చిట్కాలు

image

* ఫ్లాస్క్‌ని ఎంత శుభ్రం చేసినా దుర్వాసన వస్తుంటే మజ్జిగతో కడగాలి.
* అల్లం, వెల్లుల్లిని రుబ్బేటప్పుడు కొద్దిగా వేయిస్తే ఆ మిశ్రమం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.
* వంకాయ కూర వండేటప్పుడు నిమ్మరసం పిండితే కూర రంగు మారదు. రుచి కూడా పెరుగుతుంది.
* కారం డబ్బాలో ఇంగువ వేస్తే పురుగులు పట్టవు.
* పుదీనా, కొత్తమీర చట్నీ చేసేటప్పుడు పెరుగు వేస్తే రుచి పెరుగుతుంది.

News November 19, 2025

362 పోస్టులకు నోటిఫికేషన్

image

ఇంటెలిజెన్స్ బ్యూరోలో 362 MTSపోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ అర్హత గల అభ్యర్థులు ఈనెల 22 నుంచి DEC 14వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 -25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. టైర్ 1, టైర్ 2 రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.mha.gov.in/ *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.