News March 17, 2024

ఇసుకలో జగన్ రూ.40వేల కోట్ల స్కామ్: పవన్

image

AP: ఇసుక తవ్వకాలతో సీఎం జగన్ బినామీలు రూ.40వేల కోట్లు దోచేశారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. దీనిపై ప్రశ్నించిన జర్నలిస్టును చంపేశారని ఆరోపించారు. ‘రాష్ట్రం డ్రగ్స్‌కు రాజధాని అయిపోయింది. ఇక్కడ 30వేల మందికిపైగా మహిళలు అదృశ్యమయ్యారు. దీనిపై ప్రభుత్వం ఒక్కసారీ స్పందించలేదు. రాష్ట్రం నుంచి కంపెనీలు తరలిపోతున్నాయి. పారిశ్రామిక ప్రగతి దిగజారిపోయింది’ అని ఆరోపించారు.

Similar News

News November 16, 2025

ONGCలో 2,623 అప్రెంటిస్‌ పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

ONGCలో 2,623 అప్రెంటిస్ ఖాళీలకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ పాసై, 18-24 ఏళ్లు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంటుంది. అభ్యర్థులను విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://ongcindia.com/

News November 16, 2025

హనుమాన్ చాలీసా భావం – 11

image

లాయ సంజీవన లఖన జియాయే। శ్రీ రఘువీర హరషి ఉరలాయే॥ సంజీవని తెచ్చి హనుమంతుడు లక్ష్మణుడికి ప్రాణం పోశాడు. ఈ ఘనకార్యాన్ని చూసిన రాముడు ఆనందంతో ఆయనను హృదయానికి హత్తుకున్నాడు. మనం నిస్వార్థంగా, అంకితభావంతో, ధైర్యంగా ఇతరులకు సహాయం చేసినప్పుడు, ఆ శ్రమకు తగిన గౌరవం, ఉన్నతమైన ప్రేమ, అపారమైన ఆనందం లభిస్తాయి. గొప్ప పనులు చేసిన వారిని లోకం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ఆ దేవుడు కూడా! <<-se>>#HANUMANCHALISA<<>>

News November 16, 2025

నిర్వాహకుడితోనే ‘iBOMMA’ సైట్ క్లోజ్ చేయించారు!

image

ఐబొమ్మ, బప్పంటీవీ సైట్లను వాటి నిర్వాహకుడు ఇమ్మడి రవితోనే పోలీసులు క్లోజ్ చేయించారు. ‘నా వద్ద కోట్ల మంది డేటా ఉంది. ఈ వెబ్‌సైట్ మీద ఫోకస్ చేయకండి’ అని గతంలో అతడు సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఎక్కడ ఉన్నాడో ఎవరూ గుర్తించకుండా జాగ్రత్త పడినప్పటికీ సవాల్‌ను స్వీకరించిన పోలీసులు అతడిని పట్టుకున్నారు. లాగిన్ వివరాలతో సైట్‌ను మూసివేయించారు. తెలంగాణ సైబర్ పోలీసుల సత్తా ఏంటో చూపించారు.