News September 28, 2024

జగన్‌కు కొవ్వెక్కింది.. పాకిస్థాన్ వెళ్లిపోవాలి: సోమిరెడ్డి

image

AP: దేశాన్ని, మతాలను ప్రశ్నించే స్థాయికి జగన్ వచ్చేశారని TDP MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ఆయనకు కొవ్వెక్కి ఇదేం దేశం అంటున్నారని, ఇండియా కాదనుకుంటే పాక్ లేదా దుబాయ్‌కి వెళ్లిపోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో డిక్లరేషన్‌పై సంతకం చేస్తే భారతి ఇంట్లోకి రానివ్వదని పర్యటన రద్దు చేసుకున్నావా? అని ప్రశ్నించారు. తల్లి, చెల్లిని దూరం చేసుకున్న వ్యక్తి జగన్‌ అని దుయ్యబట్టారు.

Similar News

News January 21, 2026

ఊటనేల దున్నినా, మట్టి పిసికినా, ఫలితం బురదే

image

ఊటనేల ఎప్పుడూ నీరు ఊరుతూ ఉండే, సహజంగానే చిత్తడిగా ఉండే భూమి. ఆ నేలలో ఎంత కష్టపడి నాగలితో దున్నినా లేదా చేతులతో మట్టిని పిసికి గట్టి పరచడానికి ప్రయత్నించినా దాని స్వభావం మారదు. చివరికి మిగిలేది గట్టిపడని, వ్యవసాయానికి పనికిరాని బురద మాత్రమే. కొన్నిసార్లు కొందరి మనుషుల స్వభావాన్ని ఎంత మార్చాలని ప్రయత్నించినా అవి మారవు. దాని వల్ల మన శ్రమే వృథా అవుతుందని ఈ సామెత చెబుతుంది.

News January 21, 2026

గ్రహపీడ విముక్తి కోసం శనివారం గిరి ప్రదక్షిణ

image

గిరి ప్రదక్షిణను శనివారం చేస్తే గ్రహ పీడల నుంచి విముక్తి కలుగుతుందని ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు సూచిస్తున్నారు. జాతకంలో ఉండే గ్రహ దోషాల వల్ల కలిగే ఇబ్బందులు తొలగి జీవితం సుగమమవుతుందని అంటున్నారు. గిరి రూపంలో ఉన్న శివుడు భక్తుల కష్టాలను తొలగించి, రక్షణ కవచంలా నిలుస్తాడని, ఎలాంటి అడ్డంకులు ఎదురైనా వాటిని తట్టుకునే శక్తిని, గ్రహగతులను అనుకూలంగా మార్చుకునే బలాన్ని ప్రసాదిస్తుందని వివరిస్తున్నారు.

News January 21, 2026

ఎన్నికల కోసం ఇన్‌ఛార్జ్‌లను నియమించిన BJP

image

పలు రాష్ట్రాల్లో జరగనున్న ఎలక్షన్స్‌కు BJP జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఎన్నికల ఇన్‌ఛార్జులను నియమించారు. TG మున్సిపల్ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా MH మంత్రి ఆశిష్ షేలార్‌కు బాధ్యతలు అప్పగించారు. కో-ఇన్‌ఛార్జులుగా అశోక్ పర్నామీ(RJ BJP మాజీ అధ్యక్షుడు), MP రేఖా శర్మలను నియమిస్తున్నట్లు ప్రకటించారు. KL అసెంబ్లీ, చండీగఢ్ మేయర్, బెంగళూరు కార్పొరేషన్ ఎన్నికలకూ ఇన్‌ఛార్జ్, కో-ఇన్‌ఛార్జులను నియమించారు.