News October 27, 2024

జగన్ వల్లే ప్రజలపై ‘విద్యుత్’ భారం: మంత్రి గొట్టిపాటి

image

AP: వైసీపీ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లలో ఎక్కడా పారదర్శకత కనిపించలేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. ప్రస్తుతం ఇంధన సర్దుబాటు ఛార్జీల పాపం జగన్‌దేనని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల మీద దాదాపు రూ.11వేల కోట్ల భారం పడుతోందని చెప్పారు. గతంలో ఏపీ జెన్‌కోను నిర్వీర్యం చేసి యథేచ్ఛగా ప్రైవేట్ వ్యక్తుల నుంచి అధిక రేట్లకు విద్యుత్‌ను కొనుగోలు చేశారని ఆరోపించారు.

Similar News

News December 1, 2025

నల్గొండ జిల్లాలో 1,950 సర్పంచ్‌ల నామినేషన్ల ఆమోదం

image

నల్గొండ జిల్లాలో మొదటి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. ఈ జిల్లా పరిధిలోని 318 సర్పంచ్ అభ్యర్థుల స్థానాలకు గాను దాఖలైన నామినేషన్లలో 1,950 మంది సర్పంచ్ నామినేషన్లు ఆమోదించామని ఎన్నికల అధికారి అమిత్ నారాయణ తెలిపారు. ​అదే విధంగా 2,870 వార్డు సభ్యుల స్థానాలకు దాఖలైన నామినేషన్లలో 7,893 మంది వార్డు సభ్యుల నామినేషన్లు ఆమోదించామని ఆయన వెల్లడించారు.

News December 1, 2025

14,967 ఉద్యోగాలు.. అప్లైకి 3రోజులే ఛాన్స్

image

కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయల్లో 14,967 (13,025 టీచింగ్, 1,942 నాన్ టీచింగ్) పోస్టులకు అప్లై చేయడానికి ఇంకా మూడు రోజులే( DEC 4) సమయం ఉంది. పోస్టును బట్టి PG, డిగ్రీ, B.Ed, M.Ed, MCA, ME, M.Tech, M.PEd, BCA, BE, B.Tech, CTET, B.PEd, B.LiSc, ఇంటర్, డిప్లొమా ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. వెబ్‌సైట్: kvsangathan.nic.in/ *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం<<-se_10012>> జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

News December 1, 2025

కోహ్లీ 100 సెంచరీలు చేస్తారా?

image

SAపై నిన్న కోహ్లీ చెలరేగిన తీరు చూస్తే సచిన్ 100 సెంచరీల రికార్డును చేరుకోవడం కష్టం కాదేమో అని క్రీడా వర్గాల్లో టాక్ మొదలైంది. 2027 WCకు ముందు భారత్ ఇంకా 20 వన్డేలు ఆడనుంది. లీగ్‌లో ఫైనల్‌కు చేరితే మరో 5 నుంచి 10 మ్యాచులు ఆడే ఆస్కారం ఉంది. ప్రస్తుతం 83 శతకాలు బాదిన కోహ్లీ ఇక నుంచి ప్రతి 3 మ్యాచులకు 2 సెంచరీలు చేస్తే సచిన్ సరసన నిలిచే ఛాన్సుంది. మరి విరాట్ ఆ ఘనత సాధిస్తారా? మీ COMMENT.