News April 7, 2025
జగన్ హిందూ ధర్మ పరిరక్షకుడు.. వైసీపీ ట్వీట్లు

AP: తమ పార్టీ అధినేత జగన్ హిందూ ధర్మ పరిరక్షకుడు అంటూ వైసీపీ వరుస ట్వీట్లు చేస్తోంది. ఆయన సీఎంగా ఉన్నప్పుడు ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ రాజశ్యామల యాగం నిర్వహించారని పేర్కొంది. అమరావతి, విశాఖ, భువనేశ్వర్, కశ్మీర్, చెన్నైతో పాటు అమెరికాలో సైతం శ్రీవారి ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేసింది. విజయవాడలో చంద్రబాబు కూల్చేసిన ఆలయాలకు తిరిగి శంకుస్థాపన చేశారని తెలిపింది.
Similar News
News April 10, 2025
ALERT: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా..?

బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకునేవారికి నిబంధనల్ని మరింత కఠినం చేయాలని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది. ఎంత రుణం జారీ చేయాలన్నదాని నుంచి తీసుకున్న నగదును ఎలా వినియోగించాలి, రుణం తీర్చని బంగారాన్ని సంస్థలు ఎలా వేలం వేయాలి అన్న అంశాల వరకు అనేక అంశాలపై RBI విధివిధానాల్ని నిర్ణయించే అవకాశం ఉంది. ఈ ప్రకటన అనంతరం ముత్తూట్, IIFL, మణప్పురం, చోళమండలం సంస్థల షేర్లు పతనమయ్యాయి.
News April 10, 2025
పనిచేయకున్నా జీతం ఇస్తోన్న గూగుల్.. ఎందుకంటే?

తమ కంపెనీలోని టాలెంటెడ్ ఉద్యోగులను ప్రత్యర్థులు లాగేసుకోకుండా ఉండేందుకు గూగుల్ కాస్త తెలివిగా ఆలోచించింది. మార్కెట్లో Aiలో పోటీతత్వం పెరగడంతో ‘Google DeepMind’ అంటూ ఉద్యోగులతో ఒప్పందం చేసుకుంటోంది. దీనిపై సంతకాలు చేసిన వారికి ఏడాది వరకైనా పని చేయకపోయినా కంపెనీ జీతం ఇస్తుంటుంది. ఈ నిర్ణయం వీరు ఇతర కంపెనీలకు వెళ్లకుండా చేస్తుంది. అయితే దీనిపై ఉద్యోగుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిపై మీ కామెంట్?
News April 10, 2025
IPL: సన్రైజర్స్కు పండగ రోజులు కలిసి రావట్లేదా?

ఐపీఎల్ 2025లో సన్రైజర్స్ హైదరాబాద్కు ఈ సీజన్లో పండగ రోజులు పెద్దగా కలిసిరావట్లేదు. ఇప్పటివరకు 4 మ్యాచుల్లో ఓడిపోగా అందులో రెండు పండుగ రోజుల్లోనే జరగడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. గత నెల 30న ఉగాది రోజు DCపై, ఈ నెల 6న శ్రీరామనవమి రోజున GTపై ఓడిపోయింది. మరోవైపు ఈ నెల 12న హనుమాన్ జయంతి రోజు PBKSతో తలపడనుంది. ఆంజనేయుడి ఆశీస్సులతో ఆరెంజ్ ఆర్మీ గెలిచి తీరుతుందని కొందరు కామెంట్లు పెడుతున్నారు.