News March 27, 2024
జనం గెలవాలంటే.. జగన్ దిగిపోవాలి: చంద్రబాబు

AP: జనం గెలవాలంటే.. సీఎం జగన్ గద్దె దిగిపోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ‘రాష్ట్రంలో టీడీపీ పెట్టిన పథకాలన్నీ జగన్ తీసేశారు. ప్రజల బతుకుల్లో చీకట్లు నింపారు. ప్రాజెక్టులు కట్టకుండా రాయలసీమకు తీరని ద్రోహం చేశారు. పొలాలకు నీళ్లు ఇవ్వకుండా రైతులను ముంచేశారు. వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది. అందుకే వైసీపీని గద్దె దించి.. కూటమిని ఆశీర్వదించండి’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News March 25, 2026
మీలాంటి వారితో ఎప్పటికీ చర్చలు జరపం: IRGC

ఓవైపు శాంతి చర్చలు జరుగుతున్నాయని US అధ్యక్షుడు ట్రంప్, US మీడియా చెబుతుంటే ఇరాన్ మాత్రం వాటిని కొట్టిపారేస్తోంది. ట్రంప్ వంటి వ్యక్తులతో ఇరాన్ ఎన్నటికీ చర్చలు జరపదని IRGC స్పష్టం చేసింది. ఓటమిని ఒప్పందం పేరుతో కప్పిపుచ్చుకోవద్దని.. మీలో మీరే చర్చించుకునే స్థాయికి అంతర్గత కలహాలు చేరాయని ఎద్దేవా చేసింది. తమ సైన్యంతోనే ఇక్కడ స్థిరత్వం ఏర్పడుతుందని US గ్రహించే వరకు ఆయిల్ ధరలు తగ్గవంది.
News March 25, 2026
టీడీపీ ఎమ్మెల్యే కుమార్తె పెళ్లి.. హాజరైన ఏపీ, టీజీ సీఎంలు

AP: టీడీపీ సీనియర్ నేత, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కుమార్తె వైదీప్తి వివాహానికి ఇరు రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. గుంటూరులో జరిగిన ఈ వేడుకకు ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వేర్వేరుగా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఏపీ ఐటీ మంత్రి లోకేశ్తో రేవంత్ ముచ్చటించారు.
News March 25, 2026
టీడీపీ ఎమ్మెల్యే కుమార్తె పెళ్లి.. హాజరైన ఏపీ, టీజీ సీఎంలు

AP: టీడీపీ సీనియర్ నేత, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కుమార్తె వైదీప్తి వివాహానికి ఇరు రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. గుంటూరులో జరిగిన ఈ వేడుకకు ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వేర్వేరుగా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఏపీ ఐటీ మంత్రి లోకేశ్తో రేవంత్ ముచ్చటించారు.


