News November 30, 2024
విద్యుత్పై జగన్ రూ.లక్ష కోట్ల అప్పు: మంత్రి గొట్టిపాటి

AP: సెకీతో తక్కువ ధరకు విద్యుత్ ఒప్పందం చేసుకున్నందుకు తనకు శాలువాలు కప్పాలన్న YS జగన్ వ్యాఖ్యలపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసినందుకు సన్మానం చేయాలా? అని ప్రశ్నించారు. ఆయన పాలన వల్ల రాష్ట్రం 20ఏళ్లు వెనక్కు వెళ్లిపోయిందని విమర్శించారు. విద్యుత్ వ్యవస్థలపై ₹లక్ష కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. జగన్ అవినీతి నాడు రాష్ట్రం, నేడు దేశం దాటిపోయిందని దుయ్యబట్టారు.
Similar News
News December 4, 2025
జూనియర్ లెక్చరర్ల పరీక్ష ఫలితాలు విడుదల

AP: జూనియర్ లెక్చరర్ల రాత పరీక్ష ఫలితాలను APPSC విడుదల చేసింది. ఇక్కడ <
News December 4, 2025
డాలర్.. 12 లక్షల రియాల్స్!

ఇరాన్ కరెన్సీ విలువ దారుణంగా పడిపోయింది. ఓ డాలర్ 12 లక్షల రియాల్స్కు సమానమైంది. ఫలితంగా నిత్యవసరాల ధరలు పెరిగాయి. అణ్వస్త్ర కార్యక్రమాల వల్ల ఇరాన్పై అంతర్జాతీయ ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో కొన్నేళ్లుగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారుతోంది. అటు ఆ దేశంలో పవర్ గ్రిడ్ల వైఫల్యం వల్ల గంటలపాటు విద్యుత్కు అంతరాయం ఏర్పడి ప్రజలు అల్లాడుతున్నారు. 2015లో ఓ డాలర్ 32 వేల రియాల్స్కు సమానంగా ఉండేది.
News December 4, 2025
‘విటమిన్ K’ రిచ్ ఫుడ్స్ ఇవే!

ఎముకలు, గుండె ఆరోగ్యానికి విటమిన్-K అవసరం. గాయాలైనప్పుడు అధిక రక్తస్రావాన్ని నివారించడానికి రక్తం గడ్డకట్టే ప్రోటీన్ల ఉత్పత్తిలో దీనిది కీలకపాత్ర. మహిళల్లో రుతుచక్రాన్ని నియంత్రించడంలోనూ సాయపడుతుంది. ఈ విటమిన్ ఉండే ఆహారాన్ని డైట్లో చేర్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పాలకూర, క్యాబేజీ, బ్రోకలీ, కివీ, పుదీనా, క్యారెట్, అవకాడో, ద్రాక్ష, దానిమ్మ, గుమ్మడికాయ తదితరాల్లో ‘K’ విటమిన్ మెండుగా ఉంటుంది.


