News March 6, 2025
విజయమ్మ, షర్మిల షేర్ల బదిలీ రద్దు చేయాలని జగన్ పిటిషన్

తమ సంతకం లేకుండానే తన, భారతి షేర్లను తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల అక్రమంగా బదిలీ చేసుకున్నారని, వాటిని రద్దు చేయాలని మాజీ CM జగన్ HYD జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్(NCLT)లో పిటిషన్లు వేశారు. అందులో విజయమ్మ, షర్మిలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. షేర్ల బదిలీపై స్టే కోరుతూ గతవారం జగన్ దాఖలు చేసిన మధ్యంతర, తాజా పిటిషన్లపై కౌంటర్ దాఖలుకు వాద, ప్రతివాదులు గడువు కోరారు. దీంతో APR 3కి విచారణ వాయిదా పడింది.
Similar News
News February 22, 2026
కనకాంబరం దిగుబడి పెరగాలంటే ఏం చేయాలి?

కనకాంబరం దిగుబడి పెరగాలంటే మొక్కలు పెరిగే తొలిదశలో కలుపు లేకుండా చూడాలి. వేసవిలో ఎండ తీవ్రతను తగ్గించడానికి అవిసె మొక్కలను పెంచితే పాక్షిక నీడ ఏర్పడి మొక్కలు బాగా పెరిగి అధిక పూల దిగుబడి వస్తుంది. పూలు కోయడం పూర్తైన తర్వాత పూల గుత్తులను, ఎండు కొమ్మలను తొలగిస్తే ఏడాది పొడవునా పువ్వులు పూసి దిగుబడి పెరుగుతుంది. కనకాంబరం పువ్వులను రోజు విడిచి రోజు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కోయాలి.
News February 22, 2026
బొగ్గుల శ్రీనివాస్ మరణం.. వీడిన మిస్టరీ

TG: యూట్యూబర్, రచయిత బొగ్గుల శ్రీనివాస్ <<19145902>>మరణంపై<<>> మిస్టరీ వీడింది. ఆర్థిక లావాదేవీలతోనే ఆయనను మాధవరెడ్డి సుఫారీ గ్యాంగ్తో హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారించారు. ‘శ్రీనివాస్ GST పర్మిషన్ను మాధవరెడ్డి వాడుకుని డబ్బులు చెల్లించలేదు. దీంతో ఆయన ఒత్తిడి చేయడంతో నార్కెట్పల్లి వద్ద హత్య చేసి కారుతో సహా పాలేరు రిజర్వాయర్లో తోసేశారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నాం’ అని పోలీసులు చెప్పారు.
News February 22, 2026
BELలో మేనేజ్మెంట్ ఇండస్ట్రీయల్ ట్రైనీ పోస్టులు

చెన్నైలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<


