News August 1, 2024
పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా జగన్ సమీక్షలు?

AP: ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను విశ్లేషించి, పార్టీని తిరిగి గాడిలో పెట్టడానికి వైఎస్ జగన్ ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి రిపోర్టులు తెప్పించుకుంటున్నట్లు సమాచారం. త్వరలోనే 25 పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తారని తెలుస్తోంది. ప్రతి మంగళ లేదా బుధవారం నాయకులతో భేటీ ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Similar News
News March 5, 2026
భావిభారత పౌరులు.. ఊబకాయులు!

ప్రాసెస్డ్ ఫుడ్, కూల్డ్రింక్స్ తదితర ఆహార అలవాట్లు దేశ భవిష్యత్తు అయిన బాలలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. INDలో 11-17ఏళ్ల మధ్య పిల్లల్లో ఊబకాయం పెరిగి USను దాటి 2వ స్థానానికి చేరినట్లు ఒబెసిటీ అట్లాస్-2026 పేర్కొంది. 5-9 వయసు వారిలో 1.49కోట్లు, 10-19 ఏళ్ల వారిలో 2.6కోట్ల మంది అధిక బరువుతో ఉన్నట్లు చెప్పింది. 74% పిల్లలు శారీరక శ్రమ లేకే బరువు పెరుగుతున్నారు. అటు చైనా తొలిస్థానంలో ఉంది.
News March 5, 2026
సెమీస్లో టీమ్గా రాణిస్తారా?

T20WC: ఈరోజు ఇంగ్లండ్తో సెమీస్లో భారత్ వన్ మ్యాన్ షోలపై ఆధారపడకుండా జట్టుగా రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇప్పటివరకు దాదాపు అన్ని మ్యాచుల్లో ఎవరో ఒకరు రాణిస్తూ జట్టును ఆదుకుంటున్నారు. ఈసారి భారత్ ఆ తప్పు చేయొద్దంటున్నారు. వాంఖడేలో షార్ట్ బౌండరీస్ను అడ్వాంటేజ్గా తీసుకొని బ్యాటర్లు సమష్టిగా రాణించాలని.. బౌలింగ్, ఫీల్డింగ్లోనూ తడబడకూడదని కోరుకుంటున్నారు.
News March 5, 2026
రేపటి నుంచి భగభగలు!

తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఎండలు తీవ్రరూపం దాల్చనున్నాయి. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో టెంపరేచర్ 38°C దాటుతుందని వాతావరణశాఖ హెచ్చరించింది. నిన్న కర్నూలులో అత్యధికంగా 38.5°C నమోదైంది. అటు తెలంగాణలోని ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో 40+డిగ్రీల టెంపరేచర్ నమోదవుతుందని HYD వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది.


