News September 27, 2024
జగన్ సర్కార్ లడ్డూను కల్తీ చేసింది: YS షర్మిల

AP: YCP ప్రభుత్వం తిరుమల లడ్డూను కల్తీ చేసిందని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఆరోపించారు. లడ్డూకు వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని ల్యాబ్లోనూ నిర్ధారించారన్నారు. మార్కెట్ ధరల కంటే తక్కువ ధరకే జగన్ సర్కార్ నెయ్యి కొనుగోలు చేసిందని చెప్పారు. తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిన రూల్ అందరికీ వర్తిస్తుందని జగన్ను ఉద్దేశిస్తూ ఆమె వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో సీబీఐ విచారణకు ఆమె డిమాండ్ చేశారు.
Similar News
News November 21, 2025
వేరుశనగలో తుప్పు/ కుంకుమ తెగులు – నివారణ

పెరిగిన చలి తీవ్రత, తేమ వాతావరణంతో వేరుశనగలో తుప్పు లేదా కుంకుమ తెగులు వ్యాపిస్తుంది. ఈ తెగులు సోకిన మొక్క ఆకుల అడుగు భాగంలో ఇటుక రంగు/ఎరుపు రంగు చిన్న చిన్న పొక్కులు ఏర్పడి, ఆకుల పైభాగంలో పసుపు మచ్చలు కనిపిస్తాయి. ఉద్ధృతి ఎక్కువైతే ఈ పొక్కులు మొక్క అన్ని భాగాలపై కనిపిస్తాయి. తుప్పు తెగులు కట్టడికి 200 లీటర్ల నీటిలో క్లోరోథలోనిల్ 400 గ్రా. లేదా మాంకోజెబ్ 400 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి.
News November 21, 2025
పరమ పావన మాసం ‘మార్గశిరం’

మార్గశిర మాసం విష్ణువుకు అతి ప్రీతికరమైనది. ఈ మాసంలోనే దత్తాత్రేయుడు, అన్నపూర్ణాదేవి, కాలభైరవుడు వంటి దైవ స్వరూపులు అవతరించారు. పరాశరుడు, రమణ మహర్షి వంటి మహనీయులు జన్మించారు. భగవద్గీత లోకానికి అందిన పవిత్రమైన రోజు మార్గశిర శుద్ధ ఏకాదశి. ఆధ్యాత్మికంగా ముఖ్యమైన ధనుర్మాసం ప్రారంభం, హనుమద్వ్రతం, మత్స్య ద్వాదశి వంటి పర్వదినాలు ఈ మాసంలోనే ఉన్నాయి. అందుకే ఈ మాసం ఎంతో విశేషమైందని పండితులు చెబుతారు.
News November 21, 2025
ESIC ముంబైలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు

<


