News April 27, 2024
ఎస్సీ, ఎస్టీలకు జగన్ క్షమాపణ చెప్పాలి: షర్మిల

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు సీఎం వైఎస్ జగన్ క్షమాపణలు చెప్పాలని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ‘వైసీపీ పాలనలో బడుగుల జీవితాలు అధ్వానంగా మారాయి. వారి నిధులు దారి మళ్లించి ఉప ప్రణాళికను మంటగలిపారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన 28 పథకాలను తుంగలో తొక్కారు. వైసీపీ నేతలే ఎస్సీ, ఎస్టీలను దారుణంగా అణచివేస్తున్నారు. అందుకే వారికి జరిగిన అన్యాయానికి జగన్ క్షమాపణలు చెప్పాలి’ అని ఆమె పేర్కొన్నారు.
Similar News
News January 19, 2026
ECILలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

హైదరాబాద్లోని <
News January 19, 2026
వరిలో అగ్గి తెగులు – నివారణకు సూచనలు

వరి దుబ్బు చేసే దశలో అగ్గి తెగులు కనిపిస్తుంది. దీని వల్ల వరి పైర్లలో ఆకులపై నూలు కండె ఆకారం మచ్చలు కనిపిస్తాయి. ఆకుల మీద, వెన్నుల మీద గోధుమ రంగు లేదా ఇటుక రంగు మచ్చలు ఏర్పడతాయి. ఉద్ధృతి ఎక్కువగా ఉంటే మొక్క వెన్నువిరిగి వేలాడుతుంది. ఆకులు ఎండిపోయి తగలబడినట్లు కనిపిస్తాయి. దీని నివారణకు లీటరు నీటికి ట్రైసైక్లోజోల్ 75% 0.6gm లేదా అజాక్సీస్ట్రోబిన్+టెబుకోనజోల్ 2 ml కలిపి పిచికారీ చేసుకోవాలి.
News January 19, 2026
తిరుమల: లక్కీడిప్లో సులభంగా సెలెక్ట్ అవ్వాలంటే?

ఆన్లైన్ లక్కీడిప్లో పోటీ చాలా ఉంటుంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు దరఖాస్తు చేసుకోవడం వల్ల ఎంపికయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. అయితే తిరుమలలో నేరుగా రిజిస్టర్ చేసుకోవడం వల్ల మీ అదృష్టం కలిసొచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ విధానంలో తక్కువ మంది పోటీ పడతారు కాబట్టి, సేవల్లో పాల్గొనే భాగ్యం త్వరగా లభిస్తుంది. తిరుమలకు వెళ్లినప్పుడు లక్కీడిప్ కోసం నమోదు చేసుకోవడం మంచిది.


