News April 27, 2024
ఎస్సీ, ఎస్టీలకు జగన్ క్షమాపణ చెప్పాలి: షర్మిల

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు సీఎం వైఎస్ జగన్ క్షమాపణలు చెప్పాలని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ‘వైసీపీ పాలనలో బడుగుల జీవితాలు అధ్వానంగా మారాయి. వారి నిధులు దారి మళ్లించి ఉప ప్రణాళికను మంటగలిపారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన 28 పథకాలను తుంగలో తొక్కారు. వైసీపీ నేతలే ఎస్సీ, ఎస్టీలను దారుణంగా అణచివేస్తున్నారు. అందుకే వారికి జరిగిన అన్యాయానికి జగన్ క్షమాపణలు చెప్పాలి’ అని ఆమె పేర్కొన్నారు.
Similar News
News December 9, 2025
స్థూల సేంద్రియ ఎరువుల ప్రత్యేక ఏమిటి?

స్థూల సేంద్రియ ఎరువుల్లో పోషకాలు తక్కువ పరిమాణంలో ఉంటాయి. వీటిని ఎక్కువ పరిమాణంలో వాడవలసి ఉంటుంది. వీటి వినియోగంతో నేలలో నీరు ఇంకే స్వభావం, నీరు నిల్వ చేసే గుణం, నీటి పారుదల, నేల ఉష్ణోగ్రత, గాలి ప్రసరణ మెరుగుపడతాయి. ఉదాహరణ: పశువుల ఎరువు, కోళ్లు, మేకల విసర్జన పదార్థాల ఎరువు, పచ్చిరొట్ట ఎరువులు మొదలైనవి. ఇవి మన ఊళ్లలోనే దొరుకుతాయి. వాటిని వృథాగా వదిలేయకుండా పొలాల్లో వేస్తే మంచి ఫలితాలు వస్తాయి.
News December 9, 2025
5,74,908 ఎకరాల అసైన్డ్ భూములపై పున:పరిశీలన: CM CBN

AP: గత ప్రభుత్వంలో ఫ్రీ హోల్డ్లో ఉంచిన 5,74,908 ఎకరాల అసైన్డ్ భూములపై పున:పరిశీలన చేయాలని CM CBN అధికారులను ఆదేశించారు. ‘EX సర్వీస్మెన్, రాజకీయ బాధితులు, స్వాతంత్ర్యయోధులు, 1954కి ముందు అసైన్డ్ అయిన వాళ్ల భూములను 22A నుంచి తొలగించాలి. అనుమతుల్లేని 430 రియల్ వెంచర్లలోని 15,570 ప్లాట్లకు యూజర్ ఫ్రెండ్లీ రిజిస్ట్రేషన్లు చేయాలి. 2.77 కోట్ల CAST సర్టిఫికెట్లు ఆధార్తో అనుసంధానించాలి’ అని సూచించారు.
News December 9, 2025
HURLలో అప్రెంటిస్ పోస్టులు

హిందుస్థాన్ ఉర్వరిక్ రసాయన్ లిమిటెడ్ (<


