News June 19, 2024

జగన్ అసెంబ్లీకి రావాలి: మంత్రి పయ్యావుల

image

AP: శాసనసభ వ్యవహరాల శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ బాధ్యతలు స్వీకరించారు. ఎల్లుండి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్ల ఫైలుపై తన తొలి సంతకం చేశారు. ‘ప్రజల కోసం, ప్రజా సంక్షేమానికి సభ అనేలా సమావేశాలు నిర్వహిస్తాం. జగన్ సభకు రావాలని, సమస్యలపై మాట్లాడాలనే కోరుకుంటున్నాం. సభలో స్వపక్షమైనా, విపక్షమైనా మేమే. ప్రజల కోసం ఏ పాత్ర పోషించడానికైనా సిద్ధం’ అని వెల్లడించారు.

Similar News

News November 21, 2025

కొత్త టీచర్లకు సెలవులు ఇలా..

image

AP: మెగా డీఎస్సీ ద్వారా రిక్రూట్ అయిన కొత్త టీచర్లకు సెలవులను మంజూరు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 3న వీరు విధుల్లో చేరగా డిసెంబర్ వరకు వర్తించే ప్రపోర్షనేట్ సెలవులను వెల్లడించింది. 4 CL(క్యాజువల్ లీవ్), 1 OH(ఆప్షనల్ హాలిడే), 2 SPL CL(స్పెషల్ క్యాజువల్ లీవ్), మహిళలు అదనంగా ఒక స్పెషల్ CL వినియోగించుకోవచ్చని తెలిపింది. మెగా డీఎస్సీ ద్వారా 15,941 మంది ఎంపికైన విషయం తెలిసిందే.

News November 21, 2025

7వ తరగతి అర్హతతో కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ఉద్యోగాలు

image

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో 27 కాంట్రాక్ట్ ఆపరేటర్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఏడో తరగతి ఉత్తీర్ణతతో పాటు హెవీ వెహికల్ లైసెన్స్, ఉద్యోగ అనుభవం ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ప్రాక్టికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.200, SC,STలకు ఫీజు లేదు.

News November 21, 2025

పత్తి, వేరుశనగలో ఈ ఎర పంటలతో లాభం

image

☛ పత్తి, వేరుశనగ పంటల్లో ఆముదపు పంటను ఎరపంటగా వేసి పొగాకు లద్దె పురుగుల్ని, బంతి మొక్కలు వేసి శనగ పచ్చపురుగులను సులభంగా నివారించవచ్చు.
☛ వేరుశనగలో అలసందలు వేసి ఎర్ర గొంగళి పురుగుల ఉద్ధృతిని తగ్గించవచ్చు.
☛ వేరుశనగలో పొగాకు లద్దెపురుగు నివారణకు ఆముదం లేదా పొద్దుతిరుగుడు పంటను ఎరపంటగా వేసుకోవాలి. ఎకరానికి 100 మొక్కలను ఎర పంటగా వేసుకోవాలి.