News June 19, 2024
జగన్ అసెంబ్లీకి రావాలి: మంత్రి పయ్యావుల

AP: శాసనసభ వ్యవహరాల శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ బాధ్యతలు స్వీకరించారు. ఎల్లుండి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్ల ఫైలుపై తన తొలి సంతకం చేశారు. ‘ప్రజల కోసం, ప్రజా సంక్షేమానికి సభ అనేలా సమావేశాలు నిర్వహిస్తాం. జగన్ సభకు రావాలని, సమస్యలపై మాట్లాడాలనే కోరుకుంటున్నాం. సభలో స్వపక్షమైనా, విపక్షమైనా మేమే. ప్రజల కోసం ఏ పాత్ర పోషించడానికైనా సిద్ధం’ అని వెల్లడించారు.
Similar News
News November 17, 2025
రష్యా చమురు కొనుగోళ్లలో భారత్ రెండో స్థానం

అక్టోబర్లో US సహా పలు దేశాలు రష్యాపై కొత్త ఆంక్షలు విధించాయి. అయితే అంతకుముందే ఆ దేశం నుంచి భారత్ రూ.26వేల కోట్ల విలువైన ముడి చమురు కొనుగోలు చేసినట్లు CREA వెల్లడించింది. అక్టోబర్లో రష్యా నుంచి చమురు కొన్న దేశాల్లో చైనా అగ్రస్థానంలో, IND రెండో ప్లేస్లో ఉందని తెలిపింది. అయితే ఆంక్షల తర్వాత రిలయన్స్, HPCL, మంగళూరు రిఫైనరీ తదితర సంస్థలు చమురు దిగుమతులను తాత్కాలికంగా నిలిపివేశాయి.
News November 17, 2025
iBOMMAకు ఎందుకంత క్రేజ్?

ఇతర పైరసీ వెబ్సైట్లలో యాడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల వీక్షకులు డిస్టర్బ్ అవుతారు. కానీ ఐబొమ్మలో సినిమా చూసేందుకు క్లిక్ చేసినప్పుడు మాత్రమే యాడ్ వస్తుంది. దాన్ని క్లోజ్ చేసి మరోసారి ఓపెన్ చేస్తే ఇక యాడ్స్ కనిపించవు. అలాగే HD ప్రింట్ వస్తుంది కాబట్టి లక్షల మంది ఆ సైట్లో సినిమాలు చూసేందుకు ఇష్టపడతారు. ఐబొమ్మ, బప్పం వెబ్సైట్లను ప్రతి నెలా 30 లక్షల మంది చూస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
News November 17, 2025
బీఎస్సీ నర్సింగ్లో అడ్మిషన్లు

AP: రాష్ట్రంలోని నర్సింగ్ కాలేజీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి 4 ఏళ్ల బీఎస్సీ నర్సింగ్ కోర్సులో అడ్మిషన్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు విజయవాడలోని NTR హెల్త్ యూనివర్సిటీ తెలిపింది. APNCET-2025లో 20 పర్సంటైల్ కంటే ఎక్కువ, 85-17 కటాఫ్ స్కోర్ మధ్య ఉన్నవారు అప్లై చేసుకోవచ్చని పేర్కొంది. చివరి తేదీ నవంబర్ 18. పూర్తి వివరాలకు <


