News June 19, 2024
జగన్ అసెంబ్లీకి రావాలి: మంత్రి పయ్యావుల

AP: శాసనసభ వ్యవహరాల శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ బాధ్యతలు స్వీకరించారు. ఎల్లుండి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్ల ఫైలుపై తన తొలి సంతకం చేశారు. ‘ప్రజల కోసం, ప్రజా సంక్షేమానికి సభ అనేలా సమావేశాలు నిర్వహిస్తాం. జగన్ సభకు రావాలని, సమస్యలపై మాట్లాడాలనే కోరుకుంటున్నాం. సభలో స్వపక్షమైనా, విపక్షమైనా మేమే. ప్రజల కోసం ఏ పాత్ర పోషించడానికైనా సిద్ధం’ అని వెల్లడించారు.
Similar News
News November 10, 2025
రబీ.. చౌడు నేలలకు అనుకూలమైన వరి రకాలు

☛ M.T.U 1293: సన్నగింజ రకం. పంట కాలం 120 రోజులు. చేనుపై పడిపోదు. అగ్గి తెగులును తట్టుకుంటుంది. చౌడు నేలలకు అత్యంత అనుకూలం. దిగుబడి సాధారణ భూమిలో ఎకరాకు 3 టన్నులు, చౌడు భూమిలో 2.0-2.5 టన్నులు
☛ జగిత్యాల రైస్-1(JGL-24423): పంటకాలం 120-125 రోజులు. దొడ్డుగింజ రకం. దిగుబడి ఎకరాకు 30-35 క్వింటాళ్లు. ఆరుతడి, నేరుగా విత్తే పద్ధతులకు అనుకూలం. సుడిదోమను, చలి ఉద్ధృతిని, చౌడును కొంతమేర తట్టుకుంటుంది.
News November 10, 2025
శివాలయంలో ఇలా చేస్తున్నారా?

శివాలయంలో తెలియక మనం కొన్ని తప్పులు చేస్తుంటాం. అయితే కొన్ని నియమాలు పాటించాలని పండితులు సూచిస్తున్నారు.
1. నందీశ్వరుడికి, శివునికి మధ్య నడవకూడదు. ఎందుకంటే నంది చూపు శివుడిపై స్థిరంగా ఉండాలి.
2. శివలింగానికి ఎదురుగా నిలబడి దర్శనం చేసుకోకూడదు.
3. శివాలయంలో ప్రదక్షిణ నియమాలు వేరుగా ఉంటాయి. గుడి చుట్టూ తిరిగకూడదు. సోమసూత్రాన్ని దాటకుండా.. అక్కడి వరకు వెళ్లి తిరిగి ధ్వజస్తంభం వద్దకు రావాలి.
News November 10, 2025
BIG ALERT: మరో తుఫాను.. మళ్లీ వర్షాలు!

AP: మొంథా తుఫాను విధ్వంసం నుంచి కోలుకోక ముందే రాష్ట్రాన్ని మరో ముప్పు వెంటాడుతోంది. ఈ నెల 19/20వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఇస్రో వాతావరణ నిపుణులు వెల్లడించారు. ఇది తుఫానుగా బలపడి ఈనెల 25 నాటికి తీరం దాటొచ్చని, కోస్తా జిల్లాలపై ప్రభావం ఉంటుందని తెలిపారు. అలాగే మరో నాలుగైదు రోజుల్లో శ్రీలంక సమీపంలో అల్పపీడనం ఏర్పడుతుందని, దీనివల్ల రాష్ట్రంలో వర్షాలు కురవొచ్చని అంచనా వేశారు.


