News March 15, 2025

జగన్ మరో 20ఏళ్లు కలలు కనాలి: నాగబాబు

image

AP: నోటి దురుసు ఉన్న నేతకు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వలేదని ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు. వచ్చేసారి అధికారం తమదే అని జగన్ అంటున్నారని అంతకన్నా హాస్యం మరోటిలేదన్నారు. మరో 20సంవత్సరాలు జగన్ ఇలానే కలలు కంటూ ఉండాలని కోరారు. దేవుడైనా అడిగితే వరాలు ఇస్తాడు కానీ పవన్ అడగకుండానే వరాలు ఇస్తాడని కొనియాడారు. రెండు మూడు తరాల గురించే ఆలోచించే వ్యక్తి ఆయనని అందుకే అయనకు అనుచరుడిగా ఉంటున్నానని తెలిపారు.

Similar News

News November 26, 2025

పరకామణి కేసు.. ఎస్టేట్ విభాగంపై విచారణ.!

image

తిరుమల పరకామణి కేసులో ఎస్టేట్ విభాగానికి సంబంధించి మంగళవారం పూర్తిస్థాయి విచారణ సాగినట్లు సమాచారం. రవి కుమార్ ఆస్తులు బదిలీ, ఎలా ఎప్పుడు తీసుకున్నారు. ఎవరు మధ్యవర్తిత్వం చేశారన్న విషయంపై మాట్లాడారు. దానిలో ఎవరిపాత్ర ఉందనే అంశాలపై సీఐడీ అధికారులు విచారించారు. అసలు ఎస్టేట్ విభాగానికి సంబంధించి ఆస్తుల విరాళానికి ఎలాంటి నిబంధనలు ఉన్నాయనేకోణంలో విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.

News November 26, 2025

చిత్తూరు జిల్లాకు ప్రథమ స్థానం.!

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఓటర్ల జాబితా క్లెయిమ్‌ల పరిష్కారంలో చిత్తూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉన్నట్లు డీఆర్ఓ మోహన్ కుమార్ పేర్కొన్నారు. నవంబర్ నెలకు గాను మంగళవారం జిల్లా సచివాలయంలో గుర్తింపు పొందిన పార్టీ ప్రతినిధులతో డీఆర్ఓ సమీక్షించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు క్లెయిమ్‌ల పరిష్కారం వేగవంతం అవుతుందని అన్నారు. జిల్లాలో ప్రస్తుతం 15,74,979 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు గుర్తించామన్నారు.

News November 26, 2025

చిత్తూరు జిల్లాకు ప్రథమ స్థానం.!

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఓటర్ల జాబితా క్లెయిమ్‌ల పరిష్కారంలో చిత్తూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉన్నట్లు డీఆర్ఓ మోహన్ కుమార్ పేర్కొన్నారు. నవంబర్ నెలకు గాను మంగళవారం జిల్లా సచివాలయంలో గుర్తింపు పొందిన పార్టీ ప్రతినిధులతో డీఆర్ఓ సమీక్షించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు క్లెయిమ్‌ల పరిష్కారం వేగవంతం అవుతుందని అన్నారు. జిల్లాలో ప్రస్తుతం 15,74,979 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు గుర్తించామన్నారు.