News September 26, 2024
డిక్లరేషన్ ఇచ్చాకే జగన్ దర్శనానికి వెళ్లాలి: పురందీశ్వరి

AP: టీటీడీ అధికారులకు డిక్లరేషన్ సమర్పించిన తర్వాతే శ్రీవారి దర్శనానికి వైసీపీ చీఫ్ జగన్ వెళ్లాలని ఏపీ బీజేపీ చీఫ్ పురందీశ్వరి డిమాండ్ చేశారు. జగన్ అన్యమతస్థుడు కావడంతో దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలని ట్వీట్ చేశారు. నడక ప్రారంభానికి ముందు అలిపిరి వద్ద జగన్ తన విశ్వాసాన్ని ప్రకటించాలన్నారు. కాగా ఈ నెల 27న సాయంత్రం మెట్ల మార్గంలో జగన్ తిరుమల వెళ్లనున్నారు.
Similar News
News November 9, 2025
చంద్రయాన్-3 బడ్జెట్ దాటేసిన స్క్రాప్ ఆదాయం

స్క్రాప్ అమ్మకం ద్వారా గత నెలలో కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం దాదాపుగా రూ.800 కోట్లు. ఇది చంద్రయాన్-3 కోసం మన దేశం చేసిన ఖర్చు (రూ.615 కోట్లు) కంటే ఎక్కువ. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత స్వచ్ఛ భారత్ అభియాన్ను ప్రధాని మోదీ సర్కార్ ప్రారంభించింది. పరిశుభ్రత టార్గెట్గా ప్రారంభించిన ఈ డ్రైవ్ కేంద్రానికి భారీ ఆదాయాన్ని అందిస్తోంది. 2021 నుంచి ఇప్పటివరకు రూ.4,100 కోట్లు ఆదాయం తెచ్చిపెట్టింది.
News November 9, 2025
ఘట్టమనేని జయకృష్ణ మూవీ ప్రారంభం

దివంగత సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ఆయన మనవడు ఘట్టమనేని జయకృష్ణ(రమేశ్ బాబు కుమారుడు) ఇండస్ట్రీలో అడుగుపెట్టనున్నారు. #AB4 వర్కింగ్ టైటిల్తో అజయ్ భూపతి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. గొప్ప ప్రేమ కథతో ఈ సినిమా రూపొందనుందని డైరెక్టర్ తెలిపారు.
News November 9, 2025
నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లో ఉద్యోగాలు

ఇస్రో అనుబంధ సంస్థ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లో 13 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. డిప్లొమా, టెన్త్, ఐటీఐ/NTC/NAC అర్హతగల అభ్యర్థులు రేపటి నుంచి ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్-B, డ్రాఫ్ట్స్మన్ పోస్టులు ఉన్నాయి. వెబ్సైట్: https://www.nrsc.gov.in


