News September 26, 2024

డిక్లరేషన్ ఇచ్చాకే జగన్ దర్శనానికి వెళ్లాలి: పురందీశ్వరి

image

AP: టీటీడీ అధికారులకు డిక్లరేషన్ సమర్పించిన తర్వాతే శ్రీవారి దర్శనానికి వైసీపీ చీఫ్ జగన్ వెళ్లాలని ఏపీ బీజేపీ చీఫ్ పురందీశ్వరి డిమాండ్ చేశారు. జగన్ అన్యమతస్థుడు కావడంతో దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలని ట్వీట్ చేశారు. నడక ప్రారంభానికి ముందు అలిపిరి వద్ద జగన్ తన విశ్వాసాన్ని ప్రకటించాలన్నారు. కాగా ఈ నెల 27న సాయంత్రం మెట్ల మార్గంలో జగన్ తిరుమల వెళ్లనున్నారు.

Similar News

News December 21, 2025

పోలీసులకు ఒక్క రోజులోనే రుణాలు!

image

AP: పోలీసు సిబ్బంది సంక్షేమానికి కీలక ముందడుగు పడింది. సంక్షేమ రుణాల మంజూరు ప్రక్రియను పూర్తిగా డిజిటల్‌గా మారుస్తూ ఏపీ DGP హరీశ్‌కుమార్ గుప్తా ‘APOLIS’ ఆటోమేటెడ్ లోన్ సిస్టమ్‌ను ప్రారంభించారు. గతంలో 3 నెలలు సమయం పట్టే రుణ మంజూరు ఇకపై కేవలం ఒక్క రోజులోనే పూర్తవుతుంది. లోన్లు, సెలవులు, పేస్లిప్స్ వంటి వివరాలు ‘APOLIS’ మొబైల్ యాప్‌లో అందుబాటులో ఉంటాయని డీజీపీ తెలిపారు.

News December 21, 2025

ఇతిహాసాలు క్విజ్ – 103 సమాధానం

image

ఈరోజు ప్రశ్న: ఇతనికి తల, మెడ ఉండవు. కడుపు భాగంలోనే నోరు ఉంటుంది. చేతులు మాత్రం మైళ్ల దూరం వరకు సాగుతాయి. ఎవరతను?
సమాధానం: రామాయణంలోని అరణ్యకాండలో ఈ వింతైన పాత్ర కనిపిస్తుంది. అతని పేరు ‘కబంధుడు’. ఓ శాపం వల్ల ఈ రూపం పొందుతాడు. రాముడు ఇతని బాహువులను ఖండించడంతో శాపవిమోచనం కలిగి, తిరిగి గంధర్వ రూపాన్ని పొందుతాడు. సుగ్రీవుడితో స్నేహం చేయమని రాముడికి సలహా ఇస్తాడు. <<-se>>#Ithihasaluquiz<<>>

News December 21, 2025

బీజేపీకి భారీగా విరాళాలు

image

2024-25లో రాజకీయ పార్టీలకు ₹3,811 కోట్ల డొనేషన్లు వచ్చాయి. దేశవ్యాప్తంగా 9 ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారా ఇవి అందాయి. బీజేపీకి ఏకంగా ₹3,112 కోట్లు (82%) రావడం గమనార్హం. కాంగ్రెస్‌కు ₹299 కోట్లు(8%), ఇతర పార్టీలకు ₹400 కోట్లు (10%) వచ్చాయి. పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో విరాళాలివ్వడాన్ని సుప్రీంకోర్టు గతేడాది రద్దు చేసిన విషయం తెలిసిందే. 2023-24లో ₹1,218 కోట్ల విరాళాలు వచ్చాయి.