News August 24, 2024
జగన్.. ప్రజలు ఇస్తేనే హోదా వస్తుంది: చంద్రబాబు

AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రతిపక్ష హోదా డిమాండ్పై సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ప్రజలు ఇవ్వకపోయినా జగన్ హోదా కోసం బెదిరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ‘జగన్.. హోదా, గౌరవం అనేవి నేరాలు, బెదిరింపులతో రావు. వాటిని ప్రజలు ఇవ్వాలి’ అని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నందున తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, అందుకోసం కోర్టుకు వెళ్తామని జగన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
Similar News
News October 25, 2025
‘యుద్ధం చేస్తాం’.. అఫ్గాన్కు పాక్ వార్నింగ్

పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య ఇస్తాంబుల్లో శాంతి చర్చలు ఓ కొలిక్కి రాలేదు. రేపు కూడా ఈ చర్చలు కొనసాగేలా ఉన్నాయి. ఇలాంటి సమయంలో పాక్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా మహ్మద్ ఆసిఫ్ యుద్ధం చేస్తామని హెచ్చరించడం సంచలనంగా మారింది. ‘మాకో ఆప్షన్ ఉంది. ఇప్పుడు ఎలాంటి ఒప్పందం జరగకపోతే వారిపై యుద్ధం చేస్తాం. కానీ, వాళ్లు శాంతి కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది’ అని ఖవాజా చెప్పినట్లు రాయిటర్స్ పేర్కొంది.
News October 25, 2025
ఇండస్ట్రీలో ‘Male Ego’ని ఎదుర్కోవాలి: జాన్వీ

ఇండస్ట్రీలో ఒక్కోసారి తమని తాము తక్కువ చేసుకోవాల్సి వస్తుందని హీరోయిన్ జాన్వీ కపూర్ తెలిపారు. ఓ టాక్ షోలో ఇండస్ట్రీలో పురుష అహంకారంపై ఓపెన్ కామెంట్స్ చేశారు. ‘ఇక్కడ కొనసాగాలంటే మేల్ ఈగోని ఎదుర్కోవాలి. నలుగురు మహిళలుంటే నా అభిప్రాయం నిర్భయంగా చెప్తా. అదే ప్లేస్లో పురుషులుంటే నా ఒపీనియన్ చెప్పలేను. మనకు నచ్చని విషయాలను నేను చేయను అని చెప్పలేక.. అర్థం కాలేదు అని చెప్పాల్సి వస్తుంది’ అని తెలిపారు.
News October 25, 2025
పార్టీకి నష్టం జరగొద్దనే పోరాట విరమణ: ఆశన్న

కేంద్ర బలగాల దాడులతో పార్టీకి నష్టం జరగొద్దనే సాయుధ పోరాటాన్ని విరమించామని మావోయిస్టు ఆశన్న తెలిపారు. పార్టీ ప్రధాన కార్యదర్శి BR దాదా నాయకత్వంలో అభిప్రాయ సేకరణ చేసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. సమాచార లోపంతో కొంతమంది కామ్రేడ్లు దీన్ని తప్పుగా భావిస్తున్నారని వెల్లడించారు. ఇటీవల 200 మంది మావోలతో కలిసి ఆశన్న ఛత్తీస్గఢ్లో లొంగిపోయారు. అంతకుముందు మల్లోజుల మహారాష్ట్రలో సరెండర్ అయ్యారు.


