News August 9, 2024
నేడు బెంగళూరుకు జగన్!

AP: వైసీపీ చీఫ్ జగన్ నేడు బెంగళూరుకు వెళ్లనున్నారు. ఇవాళ నంద్యాలలో పర్యటించి హత్యకు గురైన సుబ్బారాయుడి కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. అనంతరం ఓర్వకల్లు విమానాశ్రయం వెళ్లి అక్కడి నుంచి బయలుదేరుతారు. కాగా వైజాగ్ వైసీపీ ప్రజా ప్రతినిధుల సౌత్ ఇండియా టూర్ నేపథ్యంలో జగన్ బెంగళూరు పర్యటన చర్చనీయాంశంగా మారింది.
Similar News
News November 4, 2025
వరి కోతలు.. ఈ జాగ్రత్తలు పాటిస్తే మంచిది

వరి వెన్నులో 80-90% గింజలు పసుపు రంగులోకి మారుతున్నప్పుడు పంటను కోయాలి. ఈ దశలో గింజల్లో తేమ 18-24% వరకు ఉంటుంది. గింజలు పూర్తిగా ఎండే వరకు ఉంచకూడదు. పంట పక్వానికి వచ్చాక ఎక్కువ కాలం చేను మీద ఉంటే దిగుబడి తగ్గి, గింజలపై పగుళ్లు ఏర్పడి ధాన్యాన్ని మర పట్టించినప్పుడు నూక శాతం పెరుగుతుంది. గింజలలో తేమ శాతం తగ్గించడానికి పనలను 4 నుంచి 5 రోజులు చేనుపై ఎండనివ్వాలి. పనలను తిరగతిప్పితే సమానంగా ఎండుతాయి.
News November 4, 2025
ఫ్లాప్స్ వచ్చినా ఆఫర్లకు కొదవలేదు..

హిట్టు, ఫ్లాప్తో సంబంధం లేకుండా హీరోయిన్ శ్రీలీల హవా కొనసాగుతోంది. పెళ్లి సందడితో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ధమాకా, భగవంత్ కేసరి వంటి హిట్లు ఖాతాలో వేసుకున్నారు. స్కంద, ఆదికేశవ, ఎక్స్ట్రార్డినరీ మ్యాన్, గుంటూరు కారం, మాస్ జాతర అలరించలేకపోయాయి. 10కి పైగా చిత్రాల్లో నటించిన ఈ అమ్మడికి సక్సెస్ రేట్ 30శాతమే ఉంది. ప్రస్తుతం శ్రీలీల 3-4 సినిమాల్లో నటిస్తున్నారు.
News November 4, 2025
‘Admin123’.. అంతా కొట్టేశాడు!!

గుజరాత్ హ్యాకర్ పరిత్ ధమేలియా 2024లో ఢిల్లీ, నాసిక్, ముంబై తదితర నగరాల్లో 50K CCTV క్లిప్స్ తస్కరించాడు. విద్యాసంస్థలు, ఆస్పత్రుల్లోని ఈ క్లిప్స్ పోర్న్ మార్కెట్లో అమ్మేశాడు. మొదట రాజ్కోట్ పాయల్ ఆస్పత్రిలో గైనకాలజీ టెస్ట్స్ ఫుటేజ్ కోసం CCTV హ్యాక్ చేస్తే పాస్వర్డ్ Admin123 అని తెలిసింది. ఇదే పాస్వర్డ్తో ఇతర నగరాల్లోనూ హ్యాక్ చేశాడు. ఈ Febలో అరెస్టైన పరిత్ నేర వివరాలు తాజాగా బయటకొచ్చాయి.


