News February 18, 2025
నేడు వల్లభనేని వంశీకి జగన్ పరామర్శ

AP: విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు పరామర్శించనున్నారు. బెంగళూరులో ఉన్న ఆయన ఉదయం 10.30 గంటలకు గాంధీనగర్ జిల్లా జైలు వద్దకు చేరుకుంటారని తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం తమ నేతలపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయిస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది.
Similar News
News February 4, 2026
అఫ్గాన్పై ఘన విజయం.. ఫైనల్కు భారత్

U19WCలో టీమ్ ఇండియా ఫైనల్కు దూసుకెళ్లింది. సెమీ ఫైనల్లో అఫ్గాన్పై 7 వికెట్ల తేడాతో గెలిచింది. 41.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని(311) ఛేదించింది. జార్జ్(115) శతకంతో చెలరేగారు. వైభవ్ సూర్యవంశీ(68), ఆయుశ్ మాత్రే(62), విహాన్ మల్హోత్రా(38) అదరగొట్టారు. కుర్రాళ్లను కట్టడి చేయడంలో అఫ్గాన్ బౌలర్లు చేతులెత్తేశారు. నూరిస్తానీ 2, జద్రాన్ 1 వికెట్ మాత్రమే తీశారు. FEB 6న ENG-19, IND-19 ఫైనల్లో తలపడనున్నాయి.
News February 4, 2026
డ్వాక్రా ఉత్పత్తుల బ్రాండ్ నేమ్ ‘స్వయం’

AP: డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ కల్పించాల్సిన అవసరముందని CM CBN పేర్కొన్నారు. సచివాలయంలో డ్వాక్రా ఉత్పత్తులకు బ్రాండింగ్ కోసం వివిధ లోగోలు, పేర్లను CM పరిశీలించారు. ‘‘స్వయం సహాయక సంఘాల ద్వారా ఉత్పత్తులను తయారు చేస్తున్నందున ‘స్వయం’ అనే పేరు బాగుంటుంది. లోగో కూడా అదే డిజైన్తో ఉండాలి’’ అని సూచించారు. బ్రాండ్ పేరు, లోగోతోనే కాన్సెప్ట్ అర్థమయ్యేలా ఉండాలన్నారు.
News February 4, 2026
DANGER: పచ్చి ఉల్లిపాయలు తింటున్నారా?

బిర్యానీతో పాటు పచ్చి ఉల్లిపాయలు కలిపి తింటే టేస్ట్ అదిరిపోతుంది కదా. కానీ వాటిని సరిగా శుభ్రం చేయకపోతే గ్యాస్, ఉబ్బరం, కడుపు నొప్పి, సిస్టిక్ సిర్రోసిస్ వంటి జీర్ణ సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. అలాగే గుండెల్లో మంట, నోటి దుర్వాసన వస్తాయి. కాబట్టి వీటిని తినే ముందు శుభ్రంగా కడిగి తినాలి. వీటిని తినడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి కాబట్టి మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.


