News June 22, 2024
నేడు పులివెందులకు జగన్

AP: వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్ నేడు పులివెందులలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన తాడేపల్లిలోని నివాసం నుంచి బయల్దేరుతారు. మూడు రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పార్టీ నేతలు, అభిమానులతో ఆయన సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. జగన్ పులివెందుల పర్యటనతో ఇవాళ వైసీపీ స్పీకర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి దూరంగా ఉంది.
Similar News
News February 9, 2026
‘SIR’కు అడ్డంకులు సృష్టించొద్దు.. సుప్రీంకోర్టు హెచ్చరిక

‘SIR’ ప్రక్రియను వ్యతిరేకిస్తూ WB ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై SC కీలక వ్యాఖ్యలు చేసింది. ‘సర్’ ప్రక్రియలో అడ్డంకులు సృష్టించొద్దని హెచ్చరించింది. మరోవైపు 300 మంది అధికారులను కోరితే ప్రభుత్వం 80 మందిని మాత్రమే ఇచ్చిందని EC కోర్టుకు తెలిపింది. స్థానికతను నిరూపించుకోవడానికి ఓటర్లకు ఈసీ ఒక్క అవకాశమూ ఇవ్వలేదని ప్రభుత్వం వాదించింది. దీంతో గడువును వారం రోజులపాటు పొడిగిస్తున్నట్లు SC తెలిపింది.
News February 9, 2026
పాక్ గొంతెమ్మ కోర్కెలు.. కుదరదన్న ICC!

T20WC: ఈ నెల 15న భారత్తో మ్యాచ్ ఆడేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ICCకి కొన్ని షరతులు విధించినట్లు తెలుస్తోంది. ‘భారత్-పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్, IND-PAK-BAN మధ్య ట్రై సిరీస్, భారత్ వచ్చే ఏడాది బంగ్లాలో పర్యటించాలి’ అని కోరినట్లు సమాచారం. పాక్ గొంతెమ్మ కోర్కెలను ICC తిరస్కరించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ‘అది మా పరిధి కాదు’ అని ICC సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది.
News February 9, 2026
కోలుకుంటున్న శరద్ పవార్

తీవ్ర అస్వస్థతకు గురైన NCP చీఫ్ శరద్ పవార్ కోలుకుంటున్నారని ఆయన కూతురు, ఎంపీ సుప్రియా సూలే తెలిపారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడ్డ ఆయనను ఇవాళ మధ్యాహ్నం పుణేలోని రుబీహాల్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు 5 రోజుల యాంటీబయాటిక్స్ కోర్స్ సజెస్ట్ చేసినట్లు సుప్రియ వెల్లడించారు. ఇటీవల శరద్ పవార్ సోదరుడి కుమారుడు, MH Dy.CM అజిత్ పవార్ విమాన ప్రమాదంలో కన్నుమూసిన విషయం తెలిసిందే.


