News August 31, 2024

నేడు పులివెందులకు జగన్

image

AP: నేటి నుంచి పులివెందులలో మాజీ సీఎం జగన్ మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. బెంగళూరు నుంచి ఉదయం 11 గంటలకు ఆయన కడప ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన పార్టీ నేత చంద్రారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు. మూడు రోజులు నియోజకవర్గ నేతలకు అందుబాటులో ఉండనున్నారు. వచ్చే నెల 4న విదేశాలకు వెళ్తారని సమాచారం.

Similar News

News January 3, 2026

అప్పుడు రూ.1,000.. ఇప్పుడు రూ.22,000

image

AP: 2 నెలల క్రితం టన్ను అరటి ధర రూ.1,000కి పడిపోవడంతో కన్నీరుపెట్టిన రైతన్న ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నాడు. ఉమ్మడి అనంతపురంలో ధరలు అమాంతం పెరిగాయి. ప్రస్తుతం మొదటి కోత టన్ను రూ.22 వేలకు చేరింది. ఎగుమతులు పెరగడం, వాతావరణం అనుకూలించడంతో డిమాండ్ పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో సంక్రాంతి వేళ రైతుల మోముల్లో నవ్వులు పూస్తున్నాయి. అనంతపురం, సత్యసాయి, కడప జిల్లాల్లో అరటి పెద్దసంఖ్యలో సాగైంది.

News January 3, 2026

14,582పోస్టులు.. టైర్- 2 ఎగ్జామ్స్ తేదీల ప్రకటన

image

కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్(CGL)-2025 టైర్ 2 పరీక్ష తేదీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్(<>SSC<<>>) ప్రకటించింది. జనవరి 18న స్కిల్ టెస్ట్, జనవరి 19న మ్యాథమెటికల్ ఎబిలిటీస్ అండ్ రీజనింగ్& జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లిష్ లాంగ్వేజ్&కాంప్రహెన్షన్ అండ్ జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్, స్టాటిస్టిక్స్ పరీక్ష నిర్వహించనుంది. ఈ పరీక్ష ద్వారా 14,582 పోస్టులను భర్తీ చేయనుంది.

News January 3, 2026

BJPని చూసి RSSను అర్థం చేసుకోవద్దు: మోహన్ భాగవత్

image

‘‘RSS యూనిఫాం, వ్యాయామాలను చూసి పారా మిలిటరీ అనుకోవద్దు. అలాగే BJPని చూసి సంఘ్‌ను అర్థం చేసుకోవడం పెద్ద పొరపాటు’’ అని సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. సమాజాన్ని ఏకం చేసి, విదేశీ శక్తుల చేతుల్లో భారత్ మళ్లీ చిక్కకుండా చూడటమే సంఘ్ లక్ష్యమని భోపాల్‌ (MP)లో మాట్లాడుతూ చెప్పారు. వికీపీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలు నమ్మకుండా, అసలు విషయం తెలుసుకోవడానికి నేరుగా ‘శాఖ’కు వచ్చి చూడాలని ఆయన పిలుపునిచ్చారు.