News February 23, 2025

ప్రశ్నించేందుకే అసెంబ్లీకి జగన్: వైవీ సుబ్బారెడ్డి

image

AP: ప్రజా సమస్యలపై కూటమి సర్కార్‌ను ప్రశ్నించేందుకే జగన్ అసెంబ్లీకి వస్తున్నారని YCP నేత YV సుబ్బారెడ్డి అన్నారు. చంద్రబాబు పాలనలో అందరూ ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ‘కూటమి సర్కార్ ప్రజా సమస్యలను గాలికొదిలేసింది. రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదు. YCP నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. జగన్‌కు భద్రత కల్పించకపోవడం దారుణం. వీటన్నింటిపై జగన్ అసెంబ్లీలో ప్రశ్నిస్తారు’ అని పేర్కొన్నారు.

Similar News

News November 24, 2025

ఘోర ప్రమాదం.. భయానక ఫొటో

image

TG: హైదరాబాద్ శామీర్‌పేట ORR మీద ఘోర ప్రమాదం జరిగింది. రన్నింగ్ కారులో మంటలు చెలరేగి నిమిషాల్లోనే మొత్తం దగ్ధమైంది. కూర్చున్న సీటులోనే డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. అతని అస్థిపంజరం మాత్రమే మిగిలింది. ఇందుకు సంబంధించిన భయానక ఫొటో ఉలికిపాటుకు గురిచేస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. సీట్ బెల్ట్ లాక్ అవడంతోనే డ్రైవర్ బయటకు రాలేకపోయినట్లు తెలుస్తోంది.

News November 24, 2025

భారత్-కెనడా మధ్య ట్రేడ్ టాక్స్ పున:ప్రారంభం!

image

జస్టిన్ ట్రూడో హయాంలో దెబ్బతిన్న కెనడా-భారత్ సంబంధాల పునరుద్ధరణకు అడుగులు పడుతున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్యం ఒప్పందాలపై చర్చలను ప్రారంభించేందుకు ఇరు దేశాల PMలు మోదీ, మార్క్ కార్నీ G20 సదస్సులో నిర్ణయించారు. వచ్చే ఏడాది భారత్‌లో పర్యటించేందుకు కార్నీ అంగీకరించారు. రెండు దేశాల మధ్య గత ఏడాది $22 బిలియన్ల వాణిజ్యం జరగగా, 2030 నాటికి $50 బిలియన్లకు చేర్చడమే లక్ష్యమని విదేశాంగశాఖ తెలిపింది.

News November 24, 2025

118 నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్

image

<>NIT <<>>దుర్గాపూర్‌ 118నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 2వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE, B.Tech, MSc, MCA, M.LSc, M.P.Ed, MBBS, డిగ్రీ, ఇంటర్, ITI, NET, SET, SLET ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. గ్రూప్-A పోస్టులకు దరఖాస్తు ఫీజు రూ.1500, గ్రూప్ B పోస్టులకు రూ.1000. వెబ్‌సైట్:https://nitdgp.ac.in/