News February 23, 2025
ప్రశ్నించేందుకే అసెంబ్లీకి జగన్: వైవీ సుబ్బారెడ్డి

AP: ప్రజా సమస్యలపై కూటమి సర్కార్ను ప్రశ్నించేందుకే జగన్ అసెంబ్లీకి వస్తున్నారని YCP నేత YV సుబ్బారెడ్డి అన్నారు. చంద్రబాబు పాలనలో అందరూ ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ‘కూటమి సర్కార్ ప్రజా సమస్యలను గాలికొదిలేసింది. రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదు. YCP నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. జగన్కు భద్రత కల్పించకపోవడం దారుణం. వీటన్నింటిపై జగన్ అసెంబ్లీలో ప్రశ్నిస్తారు’ అని పేర్కొన్నారు.
Similar News
News November 14, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 14, 2025
శుభ సమయం (14-11-2025) శుక్రవారం

✒ తిథి: బహుళ దశమి తె.3.34 వరకు
✒ నక్షత్రం: పుబ్బ రా.12.49 వరకు
✒ శుభ సమయాలు: ఉ.10.10-10.40, సా.5.10-5.25
✒ రాహుకాలం: ఉ.10.30-మ.12.00
✒ యమగండం: మ.3.00-సా.4.30
✒ దుర్ముహూర్తం: ఉ.8.24-ఉ.9.12, మ.12.24-మ.1.12
✒ వర్జ్యం: ఉ.8.26-ఉ.10.04
✒ అమృత ఘడియలు: సా.6.29-రా.8.07
News November 14, 2025
నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు

*ఏపీలో రూ.82వేల కోట్లతో రెన్యూ ఎనర్జీ కంపెనీ పెట్టుబడులు
*2047 నాటికి తలసరి ఆదాయం రూ.54 లక్షలు: CM CBN
*మంత్రి కొండా సురేఖ క్షమాపణలు.. కేసు విత్డ్రా చేసుకున్న నాగార్జున
*తెలంగాణ టెట్ షెడ్యూల్ విడుదల.. ఈ 15 నుంచి దరఖాస్తులు
*అల్ ఫలాహ్ వర్సిటీ సభ్యత్వం రద్దు చేసిన AIU
*బంగ్లాలో మళ్లీ హింస.. బాంబు దాడులు
*IPL: ముంబైలోకి శార్దుల్ ఠాకూర్, రూథర్ఫర్డ్


