News September 26, 2024

రేపు తిరుమలకు జగన్: హై టెన్షన్

image

AP: తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో మాజీ సీఎం జగన్ రేపు తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు. ఎల్లుండి శ్రీవారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. కాగా జగన్ పర్యటన నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అలిపిరిలోనే జగన్ డిక్లరేషన్ ఇవ్వాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే కొండ కిందనే ఆయనను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

Similar News

News October 29, 2025

రెడ్ అలర్ట్‌లో ఆ జిల్లాలు: మంత్రి లోకేశ్

image

AP: తుఫాను వల్ల రాష్ట్రంలో సుమారు 40 లక్షల మంది ప్రజలు ప్రభావితమవుతున్నారని మంత్రి లోకేశ్ తెలిపారు. ‘కాకినాడ, కోనసీమ, ప.గో., కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను అత్యధిక తీవ్రత కలిగిన ప్రాంతాలుగా గుర్తించాం. అవి రెడ్ అలర్ట్‌లో ఉన్నాయి. ఎలాంటి ప్రాణ నష్టం ఉండకూడదనేదే మా లక్ష్యం’ అని ట్వీట్ చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ఈ రాత్రికి ఆయన RTGS కేంద్రంలోనే బస చేయనున్నారు.

News October 29, 2025

టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు

image

◆ బ్రహ్మోత్సవాల్లో పనిచేసిన పర్మినెంట్ ఉద్యోగులకు ₹15,400, కాంట్రాక్ట్/అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ₹7,535 చొప్పున బహుమానం.. తిరుమల, తిరుపతి సిబ్బందికి అదనంగా 10%
◆ గోశాలల నిర్వహణకు నిపుణుల కమిటీ ఏర్పాటు.. నివేదిక ఆధారంగా సంస్కరణలు
◆ కొనుగోలు విభాగంలో అవకతవకలపై ACBతో విచారణ
◆ కాణిపాకం ఆలయం వద్ద ₹25Crతో యాత్రికుల వసతి సముదాయం, వివాహ హాల్స్ నిర్మాణానికి ఆమోదం

News October 29, 2025

సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించనున్న రజినీ?

image

రజినీకాంత్, కమల్ హాసన్ కాంబోలో ఓ మల్టీస్టారర్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. 2027లో షూటింగ్ ప్రారంభవుతుందని, రజినీకి ఇదే చివరి సినిమా అని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్టు తర్వాత రిటైర్ కావాలని ఆయన డిసైడయ్యారట. కాగా ఆయన ప్రస్తుతం నెల్సన్ దర్శకత్వంలో ‘జైలర్-2’ చేస్తున్నారు. ఆ తర్వాత సి.సుందర్‌తో ఓ మూవీ చేస్తారని టాక్ వినిపిస్తోంది. రజినీ-కమల్ మూవీని నెల్సన్ తెరకెక్కిస్తారని సమాచారం.