News January 9, 2025
తిరుపతి బాధితులను పరామర్శించనున్న జగన్

AP: తిరుపతి తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలను మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శిస్తారు. ఇవాళ సాయంత్రం స్విమ్స్ ఆస్పత్రిలో ఆయన బాధితులతో సమావేశమవుతారు. కాగా మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని వైసీపీ డిమాండ్ చేసింది.
Similar News
News November 5, 2025
BSNL ఫైబర్.. బేసిక్ ప్లాన్ కేవలం రూ.399!

సరసమైన రీఛార్జ్ ప్యాక్స్తో యూజర్లను ఇంప్రెస్ చేస్తోన్న ప్రభుత్వ రంగ సంస్థ BSNL ఇప్పుడు అతి తక్కువ ధరకే ఫైబర్ బేసిక్ ప్లాన్ను అందిస్తోంది. BSNL తమ ఫైబర్ బేసిక్ ప్లాన్ను కేవలం ₹399గా నిర్ణయించింది. దీంతో 60 Mbps వేగంతో నెలకు 3300 GB డేటాను పొందగలరు. ఆ తర్వాత 4Mbps వేగంతో డేటా లభిస్తుందని సంస్థ ప్రకటించింది. ఈ ఆఫర్లో మొదటి నెల ఉచితం కాగా.. తొలి 3 నెలలు ప్లాన్పై అదనంగా ₹100 తగ్గింపు ఉంటుంది.
News November 5, 2025
బంధంలో బ్యాలెన్స్ ముఖ్యం

అన్యోన్యంగా జీవితాన్ని సాగించాలనుకునే దంపతులు పట్టు విడుపులు సమానంగా పాటించాలి. అంతేగానీ బంధాన్ని నిలబెట్టుకోవాలన్న తాపత్రయంతో అవతలి వారి తప్పులను క్షమిస్తూ పోతే మీ జీవితాన్ని మీరే పాడుచేసుకున్నట్లవుతుంది. సున్నితమైన విషయాలను నిర్లక్ష్యం చేయడం వల్ల మీ జీవితం మీకు తెలీకుండానే చేజారే అవకాశం ఉంది. బంధమేదైనా అన్ని రకాలుగా బ్యాలన్స్డ్గా ఉంటేనే కలకాలం నిలుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
News November 5, 2025
ఎక్కువ సేపు కూర్చుంటే ‘థ్రాంబోసిస్’ వ్యాధి

4-6 గంటలు ఒకేచోట కూర్చుని పనిచేసే వాళ్లలో రక్తం గడ్డకట్టే(థ్రాంబోసిస్) వ్యాధి పెరుగుతున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. ఆధునిక జీవనశైలి, ఎక్కువదూరం ఫ్లైట్ జర్నీలు, ఆస్పత్రుల్లో అధిక సమయం గడపడం వల్ల ఈ రిస్క్ ఉంటుందని వెల్లడైంది. ‘ఇలాంటివారి కాళ్లలోని సిరల్లో రక్తం గడ్డ కడుతుంది. దీంతో తీవ్రమైన నొప్పితో బాధపడతారు. దీన్ని మొదట్లోనే నియంత్రించకపోతే ఊపిరితిత్తులు, గుండెకూ సమస్య రావొచ్చు’ అని తేలింది.


