News October 3, 2025

ఈ నెల 9న జగన్ ఉత్తరాంధ్ర పర్యటన?

image

AP: YCP చీఫ్ జగన్ ఈ నెల 9న ఉత్తరాంధ్రలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. నర్సీపట్నం మెడికల్ కాలేజీని ఆయన సందర్శించనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పర్యటన విజయవంతం చేసేందుకు ఈ నెల 5న ఉత్తరాంధ్ర నేతలు సమావేశం కానున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ స్థానాల్లో YCP రెండింటిలోనే గెలిచింది. ఈ క్రమంలో పార్టీ బలోపేతం, నాయకుల మధ్య సమన్వయంపై జగన్ దిశానిర్దేశం చేస్తారని టాక్.

Similar News

News October 3, 2025

ఇందుకే బంగారం ధరలు పెరుగుతున్నాయ్!

image

ప్రపంచవ్యాప్తంగా డాలర్‌ వాడకం తగ్గడం, BRICS దేశాలు భారీగా బంగారాన్ని కొనడంతోనే గోల్డ్ ధరలు భారీగా పెరుగుతున్నట్లు ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్ వంటి భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు & స్టాక్స్/క్రిప్టో మార్కెట్ల అనిశ్చితి మధ్య పెట్టుబడిదారులు పసిడిని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. అంతేకాక, బంగారం ఉత్పత్తి తగ్గడం.. డాలర్ బలహీనపడటం కూడా దీని విలువను పెంచుతున్నాయి.

News October 3, 2025

తాజా న్యూస్

image

* TG: సికింద్రాబాద్-ఫలక్‌నుమా రైల్వే లైన్‌పై ROBని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. రూ.52.03 కోట్ల వ్యయంతో 360 మీటర్ల పొడవైన నాలుగు లైన్ల బ్రిడ్జి నిర్మాణం.
* AP: పల్నాడులోని సత్తెనపల్లిలో హోటల్ సిబ్బందితో ఘర్షణ.. YCP అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌పై కేసు నమోదు
* వాయుగుండం బీభత్సం.. విశాఖలో 80 ప్రాంతాల్లో కూలిన చెట్లు
* వెస్టిండీస్‌తో తొలి టెస్టు.. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ స్కోరు 218/3

News October 3, 2025

రోజూ 30ని.లు నడిస్తే!

image

నడక మన ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నా చాలా మంది అడుగేయకుండా ఉన్నచోటే కూర్చుండిపోతున్నారు. కానీ రోజుకు 30 ని.లు నడిస్తే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని 35% తగ్గిస్తుంది. సెరోటోనిన్ & డోపమైన్ స్థాయులను పెంచి, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే మెదడు ఆరోగ్యాన్ని పెంచి, జ్ఞాపకశక్తి క్షీణతను తగ్గిస్తుంది. SHARE IT