News September 27, 2024

జగన్ చట్టాన్ని ఉల్లంఘించారు: చంద్రబాబు

image

AP: తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చి అనేక మంది ఇతర మతస్థులు శ్రీవారి దర్శనం చేసుకున్నారని సీఎం చంద్రబాబు చెప్పారు. ‘చట్టాన్ని గౌరవించాల్సిన మొదటి వ్యక్తి సీఎం. ఆ హోదాలోనే జగన్ చట్టాన్ని ఉల్లంఘించారు. గతంలో డిక్లరేషన్ ఇవ్వలేదని చెప్పడానికి ఆయనకు సిగ్గుండాలి. జగన్‌కు విశ్వసనీయత లేదు. దేవుడి వద్దకు వెళ్లే ఎవరైనా ఆ ఆచారాలను పాటించాల్సిందే. మత సామరస్యాన్ని పాటిద్దాం’ అని స్పష్టం చేశారు.

Similar News

News November 16, 2025

KG చికెన్ ధర ఎంతంటే?

image

గత వారంతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరల్లో పెద్దగా మార్పు లేదు. హైదరాబాద్‌లో స్కిన్ లెస్ కేజీ రూ.210-230 పలుకుతోంది. కామారెడ్డిలో రూ.230-240గా ఉంది. అటు ఏపీలోని విజయవాడలో రూ.250, గుంటూరులో రూ.260, ప.గో. జిల్లా భీమవరంలో రూ.230-250, ఏలూరులో రూ.230కి విక్రయిస్తున్నారు. దాదాపు అన్ని ప్రాంతాల్లో మటన్ కేజీ రూ.800కు పైగానే ఉంది. మరి మీ ఏరియాలో చికెన్, మటన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News November 16, 2025

కుమారుడి ఫస్ట్ బర్త్‌డే.. ఫొటో షేర్ చేసిన రోహిత్

image

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. నిన్న తన కుమారుడు అహాన్ ఫస్ట్ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఫొటోలను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘సమయం చాలా వేగంగా ముందుకు వెళ్తోంది. కానీ ప్రతి క్షణాన్ని మేము ఆస్వాదిస్తున్నాం’ అని పేర్కొన్నారు.

News November 16, 2025

ibomma రవి: సీఈవో నుంచి పైరసీ దాకా..

image

పైరసీ మూవీ వెబ్‌సైట్ ibomma నిర్వాహకుడు ఇమ్మడి రవి నిన్న అరెస్టయిన విషయం తెలిసిందే. అతడు గతంలో ER ఇన్ఫోటెక్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీకి CEOగా పని చేశాడు. ఐదేళ్ల క్రితం భార్యతో విడాకులు తీసుకున్నాడని, తర్వాత పైరసీ రంగంలోకి అడుగుపెట్టాడని తెలుస్తోంది. సర్వర్లను ఈజీగా హ్యాక్ చేయగలిగేలా పట్టు సాధించాడని సమాచారం. అయితే తనను పోలీసులు పసిగట్టరనే ధీమాతో విదేశాల నుంచి కూకట్‌పల్లికి వచ్చి దొరికిపోయాడు.