News August 6, 2024
బాధితులను పరామర్శించిన జగన్

AP: టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడిన వైసీపీ కార్యకర్తలను మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. విజయవాడలోని సన్రైజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాసరావు, గోపీ, రామకృష్ణలను ఆయన పరామర్శించి భరోసా ఇచ్చారు.
Similar News
News January 14, 2026
కాసేపట్లో వర్షం..

TG: హైదరాబాద్లో కాసేపట్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. పటాన్చెరు, లింగపల్లి, కూకట్పల్లి, మియాపూర్, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, మేడ్చల్, నిజాంపేట్, కుత్బుల్లాపూర్, అల్వాల్, గాజులరామారం ప్రాంతాల్లో రాబోయే 2 గంటల్లో వాన పడుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే వికారాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది.
News January 14, 2026
ధోనీకే సాధ్యం కానిది.. రాహుల్ రికార్డు

భారత ప్లేయర్ KL రాహుల్ ధోనీకి కూడా సాధ్యం కాని ఘనత సాధించారు. వన్డేల్లో న్యూజిలాండ్పై సెంచరీ చేసిన తొలి భారత వికెట్ కీపర్ బ్యాటర్గా రికార్డులకెక్కారు. రాజ్కోట్ వేదికగా వన్డేల్లో శతకం చేసిన తొలి ఇండియన్ కూడా ఈయనే. ఓవరాల్గా రాహుల్కిది వన్డేల్లో ఎనిమిదో సెంచరీ. ఈ ఏడాదిలో భారత్ తరఫున ఇదే తొలి అంతర్జాతీయ శతకం. సెంచరీ చేసిన సమయంలో తన కూతురుకు అంకితం ఇస్తున్నట్లుగా రాహుల్ సెలబ్రేట్ చేసుకున్నారు.
News January 14, 2026
మేము కాకుంటే రష్యా, చైనా గ్రీన్ల్యాండ్ను సొంతం చేసుకుంటాయి: ట్రంప్

తమ నేషనల్ సెక్యూరిటీ కోసం గ్రీన్ల్యాండ్ అవసరం అని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. తాము అమెరికాలో చేరబోమని, డెన్మార్క్లోనే ఉంటామని గ్రీన్ల్యాండ్ ప్రధాని ప్రకటించడంపై ట్రంప్ స్పందించారు. ‘గ్రీన్ల్యాండ్ అమెరికా చేతుల్లో ఉండటం వల్ల నాటో మరింత స్ట్రాంగ్ అవుతుంది. మేము కాకుంటే రష్యా, చైనా గ్రీన్ల్యాండ్ను సొంతం చేసుకుంటాయి. అది జరగనివ్వను’ అని పోస్ట్ చేశారు.


