News March 24, 2025
అరటి రైతులను పరామర్శించిన జగన్

AP: కడప జిల్లా లింగాల మండలంలో మాజీ సీఎం జగన్ పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులతో మండలంలోని తాతిరెడ్డి పల్లె, కోమన్నూతల, ఎగువపల్లె గ్రామాల్లో నేలకొరిగిన అరటి తోటలను పరిశీలించి బాధిత రైతులను పరామర్శించారు. మండలంలో 2,460 ఎకరాల్లో అరటి పంట నష్టపోయినట్లు ఉద్యానశాఖ అధికారి రాఘవేంద్రారెడ్డి జగన్కు తెలిపారు. తమను ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని ఈ సందర్భంగా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News March 26, 2025
సూర్యాపేట: ధాన్యం కొనుగోలుకు సన్నద్ధమవుతున్న యంత్రాంగం

సూర్యాపేట జిల్లాలో యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులకు ఉండొద్దని ఏప్రిల్ మొదటి వారంలోనే కొనుగోళ్లు ప్రారంభించేలా సివిల్ సప్లై అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. యాసంగి సీజన్లో జిల్లా వ్యాప్తంగా 4,73,739 ఎకరాల్లో వరిసాగు చేయగా దాదాపు 4.07 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనాలు వేశారు.
News March 26, 2025
ALERT: నేడు 108 మండలాల్లో వడగాలులు

AP: రాష్ట్రంలో ఇవాళ 108 మండలాల్లో వడగాలులు వీస్తాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం (15), విజయనగరం (21), మన్యం (10), అల్లూరి (8), అనకాపల్లి (7), కాకినాడ (7), కోనసీమ (3), తూర్పుగోదావరి (13), ఏలూరు (5), కృష్ణా (2), ఎన్టీఆర్ (6), గుంటూరు (3), పల్నాడు జిల్లాలోని 8 మండలాల్లో వడగాలులు వీస్తాయని అంచనా వేసింది. అలాగే ఇవాళ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని పేర్కొంది.
News March 26, 2025
మెగాస్టార్-అనిల్ సినిమా స్టార్ట్ అయ్యేది అప్పుడే!

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కే సినిమాకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఉగాది రోజున ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు మేకర్స్ సిద్ధమైనట్లు సినీవర్గాలు తెలిపాయి. దీనిని వినోదభరితమైన చిత్రంగా రూపొందిస్తారని పేర్కొన్నాయి. కాగా ఇప్పటికే చిరు ‘విశ్వంభర’ షూటింగ్ పూర్తి చేసుకోగా, మే 9న విడుదల కానుంది. ఇక అనిల్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బ్లాక్బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే.