News July 4, 2024

జగన్ ఘర్షణ వాతావరణం సృష్టించాలని చూశారు: హోంమంత్రి అనిత

image

AP: జైల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసేందుకు మాజీ సీఎం జగన్ రూ.25లక్షలు ఖర్చు చేశారని హోంమంత్రి అనిత ఆరోపించారు. ములాఖత్‌లు అయిపోయినా మానవతా దృక్పథంతో జగన్‌కు అనుమతి ఇచ్చామని తెలిపారు. కానీ ఆయన ఘర్షణ వాతావరణం సృష్టించాలని ప్రయత్నించారని, జైలు నుంచి బయటకు వచ్చి మీడియాతో ఏదేదో మాట్లాడి వెళ్లిపోయారని అన్నారు. గత ప్రభుత్వం అక్రమంగా పెట్టిన కేసులపై విచారణ చేపడతామని పేర్కొన్నారు.

Similar News

News December 24, 2025

గోళ్లు పుచ్చిపోయాయా?

image

ఎక్కువగా నీళ్లల్లో తడవడం, పనిచేయడం వల్ల కాలి గోళ్లు పచ్చబడి, తేలికగా విరిగిపోతుంటే నెయిల్ ఫంగస్‌ సోకినట్లని నిపుణులు చెబుతున్నారు. ఇలా కాకుండా ఉండాలంటే హైడ్రోజన్ పెరాక్సైడ్, నీళ్లు ఒక ప్లాస్టిక్ టబ్లో కలుపుకోవాలి. ఈ నీళ్లలో పాదాలను అరగంట పాటు ఉంచాలి. ఇలా ప్రతి రోజూ క్రమం తప్పక చేయాలి. ఫంగస్ వదిలి గోళ్లు సాధారణ రంగులోకి వచ్చినా, ఈ చిట్కాను మానేయకుండా మరికొన్ని రోజుల వరకూ కొనసాగించాలి.

News December 24, 2025

వీరికి ఎదుటివారి బాధలు అర్థం కావు!

image

రాజా వేశ్యా యమశ్చాగ్నిః చోరాః బాలక యాచకః
పరదుఃఖం నజానంతి అష్టమో గ్రామ కంటకాః
తమ స్వభావం, వృత్తి ధర్మాల వల్ల కొందరు ఎదుటివారి బాధలను పట్టించుకోరు. రాజు అధికార గర్వంతో, వేశ్య ధనం కోసం, యముడు ప్రాణాలు తీయడమే విధిగా ఉండటం వల్ల కఠినంగా ఉంటారు. అగ్ని సర్వాన్ని దహిస్తుంది. దొంగ స్వార్థంతో దోచుకుంటాడు. బాలకులు అజ్ఞానంతో, యాచకులు అవసరం కోసం, గ్రామ కరణం(అధికారి) స్వలాభం కోసం ఇతరుల కష్టాన్ని అర్థం చేసుకోరు.

News December 24, 2025

ఫలించిన సునీల్ గవాస్కర్ పోరాటం

image

మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ పోరాటం ఫలించింది. తన పేరు, ఫొటోలు, వాయిస్‌ను అనుమతి లేకుండా వాడకూడదంటూ ఢిల్లీ హైకోర్టు నుంచి <<18640617>>పర్సనాలిటీ రైట్స్<<>> పొందిన తొలి భారత క్రీడాకారుడిగా నిలిచారు. గవాస్కర్ పేరు, ఫొటోలను తప్పుగా ఉపయోగించకూడదని స్పష్టం చేసింది. అనుమతి లేని పోస్టులు, వీడియోలను 72 గంటల్లో తొలగించాలని కోర్టు ఆదేశించింది. గతంలో అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ వంటి వారు ఈ రైట్స్ పొందారు.