News July 4, 2024

జగన్ ఘర్షణ వాతావరణం సృష్టించాలని చూశారు: హోంమంత్రి అనిత

image

AP: జైల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసేందుకు మాజీ సీఎం జగన్ రూ.25లక్షలు ఖర్చు చేశారని హోంమంత్రి అనిత ఆరోపించారు. ములాఖత్‌లు అయిపోయినా మానవతా దృక్పథంతో జగన్‌కు అనుమతి ఇచ్చామని తెలిపారు. కానీ ఆయన ఘర్షణ వాతావరణం సృష్టించాలని ప్రయత్నించారని, జైలు నుంచి బయటకు వచ్చి మీడియాతో ఏదేదో మాట్లాడి వెళ్లిపోయారని అన్నారు. గత ప్రభుత్వం అక్రమంగా పెట్టిన కేసులపై విచారణ చేపడతామని పేర్కొన్నారు.

Similar News

News November 20, 2025

ఇండియాకు 100 US జావెలిన్ మిస్సైళ్లు

image

దేశ రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. $92.8M విలువైన 100 FGM-148 జావెలిన్ క్షిపణులను, ఎక్స్‌కాలిబర్ ప్రొజెక్టైల్స్ అమ్మకానికి US ఆమోదం తెలిపింది. ముప్పులను సమర్థంగా ఎదుర్కొనేలా భారత రక్షణ రంగం పటిష్ఠం అవుతుందని US డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ వివరించింది. మిస్సైల్స్‌తో పాటు లాంచర్ యూనిట్లు, ఫిరంగి గుండ్లు అందుతాయి. మిస్సైల్‌ను భుజంపై మోస్తూ ఇద్దరు ఆపరేట్ చేయొచ్చు.

News November 20, 2025

ఎక్స్‌ట్రీమ్‌ వెదర్‌తో 4,064 మంది మృతి

image

దేశంలో ప్రకృతి వైపరీత్యాలతో ఈ ఏడాది JAN-SEP వరకు 4,064 మంది మృత్యువాత పడినట్లు ఢిల్లీకి చెందిన ‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్మెంట్’ & ‘డౌన్‌ టు ఎర్త్‌’ నివేదిక వెల్లడించింది. గత 4 ఏళ్లతో పోలిస్తే మరణాలు 48% పెరిగినట్లు పేర్కొంది. 9.47 M హెక్టార్ల పంట నష్టం వాటిల్లింది. 2022తో పోలిస్తే 4 రెట్లు పెరిగింది. వ్యవసాయ రాష్ట్రాలైన AP, WBల సమాచారం అసమగ్రంగా ఉందని, నష్టం ఇంకా ఎక్కువే ఉండొచ్చంది.

News November 20, 2025

ఇజ్రాయెల్ దాడిలో 27 మంది మృతి

image

ఇజ్రాయెల్-హమాస్ మధ్య పదే పదే సీజ్ ఫైర్ ఉల్లంఘన జరుగుతోంది. నిన్న ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 27 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. గాజాలో 14 మంది, ఖాన్ యూనిస్ ఏరియాలో 13 మంది మరణించినట్లు వెల్లడించారు. హమాస్ సీజ్ ఫైర్ ఉల్లంఘనకు పాల్పడటంతోనే దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ చెబుతోంది. పరిస్థితులు మెరుగవుతున్న సమయంలో మరోసారి దాడులు ఆందోళనకు గురి చేస్తున్నాయని గాజా స్థానికులు చెబుతున్నారు.