News October 26, 2024
జగన్ సొంత ఆస్తులే ఇవ్వాలనుకున్నారు: సజ్జల
AP: షర్మిలకు సొంత ఆస్తుల్లోనూ YS జగన్ వాటా ఇవ్వాలనుకున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. గిఫ్ట్ డీడ్ను ఆమె దుర్వినియోగం చేసి, తల్లి పేరిట షేర్లుగా మార్చారని చెప్పారు. హైకోర్టులో స్టేటస్కో ఉన్నా ఆమె షేర్లు మార్చుకోవడంతోనే NCLTలో జగన్ పిటిషన్ వేశారని, ఆస్తులు వెనక్కు తీసుకోవాలనే ఆలోచన ఆయనకు లేదన్నారు. చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడిన ఆమెపై క్రిమినల్ కేసు పెట్టాలన్నారు.
Similar News
News October 26, 2024
మరికొన్నేళ్లు క్రికెట్ను ఆస్వాదిస్తా: ధోనీ
MS ధోనీ IPLలో కొనసాగుతారా? లేదా? అనే దానిపై సస్పెన్స్ వీడింది. తాను వచ్చే IPLలో ఆడుతానని MSD స్పష్టం చేశారు. తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొన్న ధోనీ తాను మరికొన్నేళ్లు క్రికెట్ను ఆస్వాదిస్తానని చెప్పారు. మైదానంలో ప్రొఫెషనల్ గేమ్గా ఆడితేనే విజయం సాధించగలమని అన్నారు. T20WC ఫైనల్ మ్యాచ్పై స్పందిస్తూ క్రికెట్లో చివరి వరకూ ఏం జరుగుతుందో చెప్పలేమన్నారు. కాగా తలా తాజా వ్యాఖ్యలపై ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
News October 26, 2024
Silver Shining: బంగారం కన్నా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చిన వెండి
ఈసారి బంగారం మెరుపుల్ని వెండి డామినేట్ చేసింది! ఈ ఏడాది ఇప్పటి వరకు 30% రిటర్న్ ఇచ్చింది. ఇక పుత్తడి 23%, నిఫ్టీ 15% రాబడి అందించాయి. గత OCTలో కేజీ సిల్వర్ రూ.73వేలు ఉండగా ఇప్పుడు రూ.లక్షా పదివేలకు చేరుకుంది. ఈ మెటల్ను నగలు, పాత్రలకే కాకుండా ఇండస్ట్రీస్లోనూ వాడతారు. ధరలు ఎక్కువ ఆటుపోట్లకు లోనవుతాయి కాబట్టి పోర్టుఫోలియోలో వెండి కన్నా బంగారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు.
News October 26, 2024
బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా DSC కోచింగ్: మంత్రి
AP: డీఎస్సీ అభ్యర్థుల కోసం 26 జిల్లా కేంద్రాల్లోనూ బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి ఎస్.సవిత తెలిపారు. అన్ని ప్రవేశ పరీక్షలకు బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా శిక్షణ ఇస్తామని చెప్పారు. కేంద్ర పథకాలను వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. బీసీ హాస్టళ్లలో డైట్ బిల్లు బకాయిలను త్వరలో చెల్లిస్తామన్నారు. సీడ్ పథకంతో సంచార జాతులకు మేలు కలుగుతుందని పేర్కొన్నారు.