News June 29, 2024

ఫలితాలు చూసి హిమాలయాలకు వెళ్లాలనుకున్న జగన్?

image

AP: ఎన్నికల ఫలితాలు చూసి హిమాలయాలకు వెళ్లాలనిపించిందని పార్టీ నేతలతో మాజీ CM జగన్ అన్నట్లు తెలిసింది. కానీ 40% ఓట్లు చూసి ఆగిపోయానని వారితో చెప్పినట్లు సమాచారం. ‘ఫలితాల షాక్‌లోంచి బయటకు రావడానికి నాకు 2, 3 రోజులు పట్టింది. 40 శాతం ఓట్లు అంటే పెద్ద సంఖ్యలో జనం మన వెంటే ఉన్నారు. వారి కోసమైనా నిలబడాలి అనుకున్నా. అందుకే మళ్లీ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యా’ అని అన్నట్లు వార్తలొస్తున్నాయి.

Similar News

News July 1, 2024

తెలంగాణలో నిరుద్యోగ జేఏసీ డిమాండ్లివే

image

☞ గ్రూప్-1 మెయిన్స్ ఎలిజిబిలిటీ 1:100కు పెంచాలి
☞ గ్రూప్-2లో 2వేలు, గ్రూప్-3లో 3000 ఉద్యోగాలు కలపాలి
☞ జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి
☞ 25వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలి
☞ గురుకుల టీచర్ పోస్టులు బ్యాక్‌లాగ్‌లో పెట్టకూడదు
☞ నిరుద్యోగులకు రూ.4వేల భృతి, 7 నెలల బకాయిలు ఇవ్వాలి
☞ ఈ డిమాండ్ల సాధన కోసం నిరుద్యోగ JAC నేత <<13537666>>మోతీలాల్<<>> దీక్ష చేస్తున్నారు.

News July 1, 2024

మహిళలకు బెంగాల్ సురక్షితం కాదు: జేపీ నడ్డా

image

పశ్చిమబెంగాల్‌లోని చోప్రాలో నడిరోడ్డుపై ఓ మహిళను <<13539360>>దారుణంగా<<>> కొట్టిన ఘటనపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆందోళన వ్యక్తం చేశారు. ‘మతతత్వ పాలనల్లో మాత్రమే ఉండే క్రూరత్వాన్ని గుర్తు చేస్తూ బెంగాల్‌లో ఓ భయంకరమైన వీడియో వెలుగులోకి వచ్చింది. పరిస్థితిని మరింత దిగజార్చడానికి TMC నేతలు ఈ చర్యను సమర్థిస్తున్నారు. దీదీ పాలిస్తున్న బెంగాల్ మహిళలకు సురక్షితం కాదు’ అని ట్వీట్ చేశారు.

News July 1, 2024

జూన్‌లో అధిక వర్షపాతం.. జులైలోనూ సమృద్ధిగానే!

image

AP: జూన్‌లో సాధారణ వర్షపాతం 91.2MM కాగా 143.7MM నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. శ్రీసత్యసాయి జిల్లాలో అత్యధికంగా 180% వర్షపాతం కురవగా, ఆ తర్వాత అనంతపురం(177%) నిలిచినట్లు తెలిపింది. నైరుతి రుతుపవనాల కారణంగా రాయలసీమలోని 8 జిల్లాలు, అనకాపల్లి, నెల్లూరు జిల్లాల్లో అధిక వర్షపాతం, మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. ఈనెలలోనూ సమృద్ధిగానే వానలు కురుస్తాయని అంచనా వేసింది.