News June 29, 2024
ఫలితాలు చూసి హిమాలయాలకు వెళ్లాలనుకున్న జగన్?

AP: ఎన్నికల ఫలితాలు చూసి హిమాలయాలకు వెళ్లాలనిపించిందని పార్టీ నేతలతో మాజీ CM జగన్ అన్నట్లు తెలిసింది. కానీ 40% ఓట్లు చూసి ఆగిపోయానని వారితో చెప్పినట్లు సమాచారం. ‘ఫలితాల షాక్లోంచి బయటకు రావడానికి నాకు 2, 3 రోజులు పట్టింది. 40 శాతం ఓట్లు అంటే పెద్ద సంఖ్యలో జనం మన వెంటే ఉన్నారు. వారి కోసమైనా నిలబడాలి అనుకున్నా. అందుకే మళ్లీ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యా’ అని అన్నట్లు వార్తలొస్తున్నాయి.
Similar News
News November 17, 2025
బస్సులో నన్ను అసభ్యంగా తాకాడు: మంచు లక్ష్మి

తనకు 15 ఏళ్ల వయసులో లైంగిక వేధింపులు ఎదురయ్యాయని మంచు లక్ష్మి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘నేనెప్పుడూ సొంత వాహనంలోనే ప్రయాణించేదాన్ని. హాల్ టికెట్ల కోసం ఓసారి స్కూల్ యాజమాన్యం పబ్లిక్ బస్సులో తీసుకెళ్లింది. ఓ వ్యక్తి నన్ను అసభ్యంగా తాకడంతో షాకయ్యాను. సెలబ్రిటీ ఫ్యామిలీ నుంచి వచ్చిన నాకే అలాంటి పరిస్థితి ఎదురైంది. బస్సుల్లో ప్రయాణించే మహిళలు ఇలాంటివి ఎదుర్కొంటారు కానీ బయటకు చెప్పుకోలేరు’ అని తెలిపారు.
News November 17, 2025
కోళ్లకు టీకా ఇచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కోళ్లలో ప్రాణాంతక వ్యాధులను అధిగమించేందుకు కోడిపిల్లల స్థాయి నుంచే సమయానుగుణంగా టీకాలు వేయించాల్సి ఉంటుంది. అయితే ఈ టీకాలు కోళ్లకు ఇచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. టీకా మందులను ఎప్పుడూ ఐస్ లేదా ఫ్రిజ్లో నిల్వ ఉంచి ఉపయోగించాలి. కోళ్లకు ఇతర రోగాలు ఉన్నపుడు టీకాలు వేయకూడదు. కోళ్లు అస్వస్థతకు గురైనప్పుడు, ఒత్తిడిలో ఉన్నప్పుడు టీకాలు వేయకూడదు. టీకాలను పగలు కంటే రాత్రివేళల్లో వేయడం మంచిది.
News November 17, 2025
శివారాధనతో జీవితంలో కలిగే మార్పులివే..

శివారాధనతో మనస్సు శాంతించి, ఒత్తిడి, ఆందోళనలు దూరమవుతాయి. ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఇవి ఎలాంటి కష్టాల నుంచైనా గట్టెక్కిస్తాయి. శివభక్తి మనలోని తాత్కాలిక కోరికలను తగ్గించి, శాశ్వత జ్ఞానం వైపు దృష్టి మళ్లించేలా చేస్తుంది. లయకారుడైన శివుడి ఆరాధనతో మరణ భయం తొలగి, జీవితంలో ప్రశాంతత, విచక్షణ జ్ఞానం లభిస్తాయని నమ్మకం. స్వచ్ఛమైన మనస్సుతో ఆరాధించేవారికి భోళా శంకరుడి అనుగ్రహం తప్పక లభిస్తుంది.


