News May 11, 2024

జగన్ మాకెప్పుడూ మిత్రపక్షం కాదు: మోదీ

image

AP: YCP మళ్లీ అధికారంలోకి రాదని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతిందని, ఆ పార్టీకి ప్రజలు మళ్లీ ఓట్లు వేస్తారని తాను అనుకోవడం లేదన్నారు. కొన్ని విషయాల్లో YCP MPలు తమకు మద్దతిచ్చారని, అయినా.. CM జగన్‌ను తామెప్పుడూ మిత్రపక్షంగా భావించలేదని మోదీ చెప్పుకొచ్చారు. తాము రాజకీయ ప్రత్యర్థులమేనని స్పష్టం చేశారు. ఒక ప్రధానిగా అన్ని రాష్ట్రాల్లాగే AP అభివృద్ధికి తాను కట్టుబడి ఉంటానన్నారు.

Similar News

News February 8, 2026

జొన్నలు ఆహారంగా తీసుకుంటున్నారా?

image

జొన్నలను ఆహారంగా తీసుకుంటే శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇవి శరీర బరువును తగ్గించడమే కాకుండా డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుతాయని అంటున్నారు. అధిక ఫైబర్ వల్ల మలబద్ధకం తగ్గి, జీర్ణవ్యవస్థ తీరు మెరుగుపడుతుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్‌‌ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. రొట్టె, అంబలి/జావ, కిచిడీ, దోశ/ఇడ్లీ రూపంలో వీటిని తీసుకోవచ్చు.

News February 8, 2026

కలర్ ఫుల్‌గా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ!

image

ప్రశాంత్ నీల్ సినిమాలు అనగానే గ్రే/బ్లాక్ కలర్ షేడ్‌లో ఉంటాయనే పేరుంది. అయితే ఎన్టీఆర్‌తో తీస్తున్న సినిమా కలర్ ఫుల్‌గా ఉండనుందని తెలుస్తోంది. రెగ్యులర్ స్టైల్‌లో కాకుండా కొత్త టేకింగ్‌తో తీస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ పాత్ర కోసం సన్నబడిన ఆయన భారీగా గడ్డం కూడా పెంచారు. కాగా సమ్మర్‌లో ఈ మూవీ షూటింగ్ పూర్తి కానుందని టాక్.

News February 8, 2026

రెండో టీ20కి భారత జట్టుతో చేరనున్న సుందర్: సూర్య

image

గాయం నుంచి కోలుకున్న వాషింగ్టన్ సుందర్ రెండో టీ20కి అందుబాటులో ఉంటారని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపారు. ఢిల్లీ వేదికగా నమీబియాతో జరిగే మ్యాచులో జట్టులో చేరుతారని పేర్కొన్నారు. న్యూజిలాండ్‌తో తొలి వన్డే సమయంలో సుందర్ గాయపడ్డారు. ఆ సిరీస్‌‌లో సుందర్ స్థానంలో బదోనిని తీసుకున్నా T20WC స్క్వాడ్‌లో మాత్రం ఆయన స్థానాన్ని రీప్లేస్ చేయలేదు. ఆల్‌రౌండర్ సుందర్ రాకతో భారత్ మరింత పటిష్టంగా మారనుంది.