News May 11, 2024

జగన్ మాకెప్పుడూ మిత్రపక్షం కాదు: మోదీ

image

AP: YCP మళ్లీ అధికారంలోకి రాదని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతిందని, ఆ పార్టీకి ప్రజలు మళ్లీ ఓట్లు వేస్తారని తాను అనుకోవడం లేదన్నారు. కొన్ని విషయాల్లో YCP MPలు తమకు మద్దతిచ్చారని, అయినా.. CM జగన్‌ను తామెప్పుడూ మిత్రపక్షంగా భావించలేదని మోదీ చెప్పుకొచ్చారు. తాము రాజకీయ ప్రత్యర్థులమేనని స్పష్టం చేశారు. ఒక ప్రధానిగా అన్ని రాష్ట్రాల్లాగే AP అభివృద్ధికి తాను కట్టుబడి ఉంటానన్నారు.

Similar News

News October 30, 2025

LIC AAO ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

image

ఎల్ఐసీలో 350 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(AAO)- జనరలిస్ట్ పోస్టులకు నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఎంపికైన వారి జాబితా <>https://licindia.in/<<>>లో పొందుపరిచారు. వీరికి మెయిన్ ఎగ్జామినేషన్ నవంబర్ 8న జరగనుంది. కాగా 81 అసిస్టెంట్ ఇంజినీర్స్, 410 AAO స్పెషలిస్టు పోస్టుల ప్రిలిమ్స్ రిజల్ట్స్ కూడా రేపు రిలీజ్ కానున్నాయి.

News October 30, 2025

మార్గదర్శి కేసులో ఉండవల్లి ప్రతివాదే కాదు: AP ప్రభుత్వం

image

మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసును సుప్రీం విచారించింది. మాజీ MP ఉండవల్లి అరుణ్‌కుమార్ వర్చువల్‌గా వాదనలు వినిపిస్తూ సంస్థ RBI నిబంధనల ఉల్లంఘనపై విచారించాలన్నారు. అయితే ప్రధాన పిటిషన్‌పై విచారణలో వాటిని హైకోర్టుకు చెప్పాలని SC సూచించింది. ₹2300 CR డిపాజిట్లలో చాలా వరకు చెల్లించామని సంస్థ తరఫున సిద్ధార్థ్ లూథ్రా పేర్కొన్నారు. అటు కేసులో ఉండవల్లి ప్రతివాదే కాదని AP ప్రభుత్వ న్యాయవాది SCకి తెలిపారు.

News October 30, 2025

ఇంజినీరింగ్ అర్హతతో 30 పోస్టులు

image

నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్(NEEPCO) 30 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. బీటెక్, బీఈ ఉత్తీర్ణతతో పాటు GATE-2025 అర్హత సాధించిన అభ్యర్థులు నవంబర్ 17 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్య‌ర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, గేట్ స్కోరు , ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://neepco.co.in