News July 30, 2024
పబ్లిసిటీ స్టంట్స్ చేసినందుకే జగన్ను ఇంటికి పంపారు: అచ్చెన్న

AP: రూ.650 కోట్ల ప్రజాధనంతో సర్వే రాళ్లపై మాజీ సీఎం జగన్ తన బొమ్మ వేయించారని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఇలాంటి పబ్లిసిటీ స్టంట్స్ చేసినందుకే ఆయనను జనం ఇంటికి పంపారని ఎద్దేవా చేశారు. ‘సమాధి రాళ్లపై ఫొటో వేసుకున్నట్లు సర్వే రాళ్లపై వేయించుకున్నారు. రైతులు తమ పాసు పుస్తకాలపై దిష్టిబొమ్మ పెడితే ఊరుకోరు. అందుకే ఎన్నికల్లో జగన్కు తగిన బుద్ధి చెప్పారు’ అని ఆయన మండిపడ్డారు.
Similar News
News November 22, 2025
బిట్స్ పిలానీలో ఉద్యోగాలు

హైదరాబాద్లోని బిట్స్ పిలానీ 4 కేర్ టేకర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈనెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.bits-pilani.ac.in/
News November 22, 2025
నట్స్తో బెనిఫిట్స్: వైద్యులు

నిత్యం స్నాక్స్గా ఉపయోగించే నట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. రోజు కొన్ని నట్స్ తింటే పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని 50% వరకు తగ్గించవచ్చని పలు అధ్యయనాలు వెల్లడించాయన్నారు. వీటిలోని ఫైబర్, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్స్.. ఇన్ఫ్లమేషన్ను తగ్గించి, పేగుల ఆరోగ్యాన్ని బలపరుస్తాయని తెలిపారు. రోజూ కొన్ని నట్స్ తింటే చాలా మంచిదని పేర్కొంటున్నారు.
News November 22, 2025
రెండేళ్ల నుంచి పేలుళ్లకు సిద్ధమవుతున్నాం: షకీల్

ఢిల్లీ పేలుడు కేసులో కీలక నిందితుడు డాక్టర్ ముజమ్మిల్ షకీల్ విచారణలో కీలక విషయాలు వెల్లడించాడు. రెండేళ్లుగా పేలుళ్ల కోసం సిద్ధమవుతున్నట్టు ఒప్పుకున్నాడు. యూరియా, అమోనియం నైట్రేట్, 26 క్వింటాళ్ల NPK ఫెర్టిలైజర్, కెమికల్స్ నిల్వ కోసం డీప్ ఫ్రీజర్ను ముజమ్మిల్ కొనుగోలు చేశాడు. కుట్రకు నిందితులే రూ.26 లక్షలు సమకూర్చుకున్నారు. పేలుళ్లలో ఉమర్ మరణించగా, మిగతా నిందితులు కస్టడీలో ఉన్నారు.


