News July 30, 2024

పబ్లిసిటీ స్టంట్స్ చేసినందుకే జగన్‌ను ఇంటికి పంపారు: అచ్చెన్న

image

AP: రూ.650 కోట్ల ప్రజాధనంతో సర్వే రాళ్లపై మాజీ సీఎం జగన్ తన బొమ్మ వేయించారని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఇలాంటి పబ్లిసిటీ స్టంట్స్ చేసినందుకే ఆయనను జనం ఇంటికి పంపారని ఎద్దేవా చేశారు. ‘సమాధి రాళ్లపై ఫొటో వేసుకున్నట్లు సర్వే రాళ్లపై వేయించుకున్నారు. రైతులు తమ పాసు పుస్తకాలపై దిష్టిబొమ్మ పెడితే ఊరుకోరు. అందుకే ఎన్నికల్లో జగన్‌కు తగిన బుద్ధి చెప్పారు’ అని ఆయన మండిపడ్డారు.

Similar News

News October 29, 2025

మామిడిలో చెదను ఎలా నివారించాలి?

image

మామిడిలో OCT నుంచి డిసెంబర్ వరకు చెదల బెడద ఎక్కువ. అందుకే చెట్ల బెరడుపై మట్టి గూళ్లను గమనించిన వెంటనే వాటిని తొలగించాలి. చెట్ల మొదలు, కాండంపైన లీటరు నీటికి క్లోరిఫైరిఫాస్ 20EC 3-5ml కలిపి పిచికారీ చేయాలి. తోటలలో, గట్లపై చెద పుట్టలను తవ్వి లీటరు నీటికి క్లోరిఫైరిఫాస్ 20 EC 10ml కలిపి పోయాలి. వర్షాలు తగ్గిన తర్వాత తప్పకుండా కాండానికి 2-3 అడుగుల ఎత్తు వరకు బోర్డోపేస్ట్/బ్లైటాక్స్‌ని పూతగా పూయాలి.

News October 29, 2025

పిల్లలు అబద్ధాలు చెబుతున్నారా?

image

పిల్లలు అబద్ధాలు చెప్పడం కామన్. కానీ అన్నిటికీ అబద్ధాలు చెబుతుంటే మాత్రం తల్లిదండ్రులు జాగ్రత్తపడాలంటున్నారు నిపుణులు. చాలావరకు తమను రక్షించుకోవడానికే పిల్లలు అబద్ధాలు చెబుతారు. అసలు వారు ఎందుకు అబద్ధం చెబుతున్నారో తెలుసుకోవాలి. నిజం చెప్పినా ఏంకాదన్న భరోసా వారికి ఇవ్వాలి. అప్పుడే అబద్ధాలు చెప్పకుండా ఉంటారు. తల్లిదండ్రులు తరచుగా అబద్ధాలు చెప్తుంటే పిల్లలూ అదే నేర్చుకుంటారంటున్నారు నిపుణులు.

News October 29, 2025

తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీకి సీఎం గ్రీన్‌సిగ్నల్

image

TG: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణలో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించాలన్న ఇంజినీర్ల ప్రతిపాదనకు CM రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీని నుంచి సుందిళ్లకు 80TMCల నీటిని గ్రావిటీ ద్వారా తరలించి, అక్కడి నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోసేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. తుమ్మిడిహెట్టి నిర్మాణంతో MHలో ఏర్పడే ముంపుపై అక్కడి ప్రభుత్వంతో మాట్లాడాలని నీటిపారుదల శాఖ సమీక్షలో సూచించారు.