News October 22, 2024
లెక్కలేనన్ని దుర్మార్గాలు చేసిన జగన్: మంత్రి గొట్టిపాటి

AP: రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ హెచ్చరించారు. ఏ సీఎం చేయనన్ని దుర్మార్గాలు గత ఐదేళ్లలో జగన్ చేశారని విమర్శించారు. ఆయన చేసిన అరాచకాల వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నాశనమైందని చెప్పారు. ఇప్పుడు వైసీపీ నేతలు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ పార్టీ చేసే కుట్రలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
Similar News
News January 20, 2026
గూగుల్ క్లౌడ్, IBM CEOలతో చంద్రబాబు భేటీ

దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్తో AP CM చంద్రబాబు భేటీ అయ్యారు. విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణంపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని, జాప్యం లేకుండా సెంటర్ నిర్మాణం పూర్తి చేయాలని CBN కోరారు. IBM ఛైర్మన్ అరవింద్ కృష్ణతోనూ CM సమావేశం అయ్యారు. అమరావతిలో నిర్మించే క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్పై చర్చించారు.
News January 20, 2026
రేపే తొలి T20.. IND ప్లేయింగ్ 11 ఇదేనా?

IND రేపు NZతో నాగ్పూర్ వేదికగా తొలి T20 ఆడనుంది. ఇప్పటికే నం.3లో ఇషాన్ కిషన్ ఫిక్స్ కాగా ప్లేయింగ్ 11 ఇదేనంటూ విశ్లేషకులు తమ అభిప్రాయాలను Xలో పంచుకుంటున్నారు. త్వరలోనే T20 WC ఉండటంతో పెద్దగా ప్రయోగాలు చేయకుండా తొలి మ్యాచ్ ఆడే జట్టునే సిరీస్ మొత్తం కంటిన్యూ చేసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. టీమ్: అభిషేక్, శాంసన్, కిషన్, సూర్య, హార్దిక్, దూబె, అక్షర్, రింకూ, కుల్దీప్/వరుణ్, అర్ష్దీప్, బుమ్రా.
News January 20, 2026
తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి

దావోస్ వేదికగా గూగుల్ ఆసియా-పసిఫిక్ ప్రాంతీయ అధ్యక్షుడు సంజయ్ గుప్తాతో TG CM రేవంత్ భేటీ అయ్యారు. వాతావరణ మార్పులు, వ్యవసాయం, పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న కాలుష్యం, సైబర్ సెక్యూరిటీ, స్టార్టప్ల ప్రోత్సాహంపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు గూగుల్ ఆసక్తి చూపింది. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న CURE, PURE, RARE అభివృద్ధి ఫార్ములాను రేవంత్ వివరించారు.


