News July 13, 2024

లోకేశ్‌ను కలిసిన జగన్‌పై దాడి కేసు అనుమానితుడు

image

AP: మాజీ సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వేముల సతీశ్ మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. ప్రజాదర్బార్‌లో లోకేశ్‌తో కలిసి ఆయన ఫొటో దిగారు. కాగా ఏప్రిల్ 13న విజయవాడలో సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా జగన్‌పై రాయి దాడి జరిగింది. ప్రజలకు అభివాదం చేస్తూ పక్కకు తిరగడంతో గాయం తీవ్రత తగ్గింది. ఆ తర్వాత పోలీసులు ఈ కేసులో సతీశ్‌ను ఏ1గా చేర్చి నెల్లూరు జైలుకు తరలించగా బెయిల్‌పై బయటకు వచ్చారు.

Similar News

News September 16, 2025

ఇండియా జెర్సీ స్పాన్సర్‌గా అపోలో టైర్స్?

image

టీమ్ ఇండియా జెర్సీ స్పాన్సర్‌గా అపోలో టైర్స్ కంపెనీ వ్యవహరించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం ఆ సంస్థ ఒక్కో మ్యాచుకు రూ.4.5 కోట్లు BCCIకి చెల్లించనున్నట్లు తెలుస్తోంది. 121 ద్వైపాక్షిక మ్యాచులు, 21 ఐసీసీ మ్యాచులకు కలిపి రూ.579 కోట్లకు స్పాన్సర్ హక్కులు దక్కించుకున్నట్లు సమాచారం. 2027 వరకు స్పాన్సర్‌గా ఉండనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.

News September 16, 2025

వివేకా హత్య కేసు: బెయిల్ రద్దుపై జోక్యం చేసుకోలేమన్న SC

image

AP: వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుల బెయిల్ రద్దుపై తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి దర్యాప్తు చేయాలన్న పిటిషనర్ సునీత వాదనపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం.. ట్రయల్ కోర్టులో మరో పిటిషన్ వేయాలని సూచించింది. పిటిషన్ వేసిన 8 వారాల్లో మెరిట్స్ ఆధారంగా నిర్ణయం ప్రకటించాలని, ట్రయల్ కోర్టును ఆదేశించింది.

News September 16, 2025

కూతురు మృతి.. హీరో ఎమోషనల్ కామెంట్స్

image

చనిపోయిన తన కూతురు మీరాను మిస్సవ్వడం లేదని, ఆమె ఇంకా తనతోనే ఉన్నట్లు భావిస్తున్నానని తమిళ హీరో విజయ్ ఆంటోనీ తెలిపారు. ‘నేను కూతుర్ని కోల్పోలేదు. ఆమె నాతోనే ప్రయాణిస్తోంది. ఆమెతో రోజూ మాట్లాడుతున్నా. ఇందులో ఉన్న డెప్త్ మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మీరా రెండేళ్ల క్రితం ఇంట్లో సూసైడ్ చేసుకోగా, తానూ ఆమెతోనే చనిపోయానని ఆ సమయంలో విజయ్ ఎమోషనల్ నోట్ విడుదల చేశారు.