News July 13, 2024
లోకేశ్ను కలిసిన జగన్పై దాడి కేసు అనుమానితుడు

AP: మాజీ సీఎం జగన్పై రాయి దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వేముల సతీశ్ మంత్రి నారా లోకేశ్ను కలిశారు. ప్రజాదర్బార్లో లోకేశ్తో కలిసి ఆయన ఫొటో దిగారు. కాగా ఏప్రిల్ 13న విజయవాడలో సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా జగన్పై రాయి దాడి జరిగింది. ప్రజలకు అభివాదం చేస్తూ పక్కకు తిరగడంతో గాయం తీవ్రత తగ్గింది. ఆ తర్వాత పోలీసులు ఈ కేసులో సతీశ్ను ఏ1గా చేర్చి నెల్లూరు జైలుకు తరలించగా బెయిల్పై బయటకు వచ్చారు.
Similar News
News December 4, 2025
టైర్లు ధ్వంసమైనా, నీటిలోనూ ప్రయాణం ఆగదు

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ <<18465862>>పర్యటన<<>> వేళ ఆయన ప్రయాణించే “ఆరస్ సెనాట్” కారుపై చర్చ జరుగుతోంది. ఇది ప్రపంచంలో అత్యంత సురక్షిత వాహనాల్లో ఒకటి. ఆధునిక సాంకేతికతతో రూపొందించిన ఈ కారు బాంబులు, క్షిపణి దాడులను సైతం తట్టుకుంటుంది. నీటిలో మునిగిపోయినా ఇది తేలి సురక్షిత ప్రాంతానికి చేర్చుతుంది. ప్రత్యేకంగా కస్టమైస్డ్ అయిన ఈ కారు ధర సుమారు రూ.5కోట్లు ఉంటుంది. ఇది సాధారణ పౌరులకు అందుబాటులో లేదు.
News December 4, 2025
వస్తువు కొనేముందు ఓ సారి ఆలోచించండి: హర్ష

అవసరమైన వస్తువులను మాత్రమే కలిగి ఉండే జీవనశైలిని అలవరుచుకోవాలని పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా యువతకు సూచించారు. ‘మెరుగైన లైఫ్స్టైల్ కోసం ప్రయత్నిస్తూ చాలా మంది తమ మనశ్శాంతిని కోల్పోతున్నారు. విలాసంగా జీవించడం అంటే ఎక్కువ వస్తువులను కొనడం కాదు. తక్కువ వస్తువులు ఉంటే వాటి నిర్వహణ, శ్రమ కూడా తగ్గుతుంది’ అని అభిప్రాయపడ్డారు. అందుకే వస్తువులను కొనేముందు అవి నిజంగా అవసరమా అని ఆలోచించండి. SHARE IT
News December 4, 2025
ఆఫర్లను రద్దు చేసిన 20 సంస్థలపై IITల బ్యాన్

జాబ్ ఆఫర్ ఇచ్చి ఆపై రద్దు చేసిన 20కి పైగా సంస్థలను ప్లేస్మెంట్ల డ్రైవ్ నుంచి IITలు నిషేధించాయి. ఆ కంపెనీల చర్య విద్యార్థుల కెరీర్ ప్లానింగ్కు ఆటంకం కలిగించడంతో పాటు ఒత్తిడికి గురిచేయడమే దీనికి కారణం. ఇందులో డేటా అనలటిక్స్ కంపెనీలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని ఆఫర్ లెటర్లో ఇచ్చిన ప్యాకేజీని జాయినింగ్కు ముందు తగ్గించాయి. కంపెనీల ప్లేస్మెంట్ల హిస్టరీని పరిశీలిస్తున్నట్లు IIT ప్రొఫెసర్ ఒకరు తెలిపారు.


