News September 19, 2024
జగన్ నీ సంగతి స్వామే చూసుకుంటాడు: టీడీపీ

మాజీ CM YS జగన్పై టీడీపీ ట్విటర్లో మండిపడింది. స్వామి వారి విగ్రహాన్ని నల్ల రాయి అని పగలగొడతా అని చెప్పిన అన్యమతస్థుడైన భూమనకు TTD ఛైర్మన్ పదవి ఇచ్చారంటూ ఆరోపించింది. ‘ జగన్ రెడ్డీ.. తిరుమల గురించి నువ్వు, నీ సైకో బ్యాచ్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎంత దుర్మార్గుడివి కాకపోతే తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వు కలుపుతావా? ఆయన పవర్ తెలిసి కూడా ఆటలు ఆడావు. ఆయనే చూసుకుంటాడు’ అని హెచ్చరించింది.
Similar News
News November 28, 2025
‘పుస్తకాల పండుగ’ మళ్లీ వచ్చేస్తోంది

పుస్తక ప్రియులకు గుడ్న్యూస్. DEC 19 నుంచి ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’ నిర్వహించనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. 38వ బుక్ ఫెయిర్ లోగోను ఆయన ఆవిష్కరించారు. NTR స్టేడియంలో DEC 19 నుంచి 29 వరకు పదిరోజుల పాటు ఫెయిర్ జరగనుంది. ఎంతోమంది కవులు రాసిన పుస్తకాలు స్టాల్స్లో అందుబాటులో ఉండనున్నాయి. మీరూ బుక్ ఫెయిర్ కోసం ఎదురుచూస్తున్నారా? ఈ సారి ఏ పుస్తకం కొనాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.
News November 28, 2025
ఏపీ న్యూస్ రౌండప్

* రోడ్ల మరమ్మతుల కోసం రూ.276 కోట్ల నిధుల విడుదలకు ప్రభుత్వం పరిపాలనా అనుమతి ఇచ్చింది.
* ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్ స్కీమ్ నిర్వహణలో లోపాలను పరిష్కరించడానికి CS విజయానంద్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది.
* IRS అధికారి జాస్తి కృష్ణకిశోర్పై గతంలో CID నమోదుచేసిన అభియోగాలను ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
* వర్షాలకు ధాన్యం తడిచి రైతులు తక్కువ ధరకు అమ్ముకున్నారనే కంప్లైంట్లు వస్తే JCలదే బాధ్యత: CS విజయానంద్
News November 28, 2025
సర్పంచ్ పోస్టు@రూ.కోటి

TG: సర్పంచ్ పదవులను <<18400001>>ఏకగ్రీవంగా<<>> సొంతం చేసుకునేందుకు వేలంపాటలు జోరుగా సాగుతున్నాయి. మహబూబ్నగర్(D) టంకర్ గ్రామ పంచాయతీని ఓ వ్యాపారి ₹కోటికి దక్కించుకున్నారు. ఆంజనేయస్వామి ఆలయానికి నిధులు ఖర్చు చేసేలా ఒప్పందం చేసుకున్నారు. గద్వాల(D) కొండపల్లిలో ₹60L, గొర్లఖాన్దొడ్డిలో ₹57L, చింతలకుంటలో ₹38L, ముచ్చోనిపల్లిలో రూ.14.90L, ఉమిత్యాల తండాలో ₹12L చొప్పున సర్పంచ్ సీటుకు వేలంపాట పాడారు.


