News July 14, 2024
భావప్రకటనా స్వేచ్ఛను జగన్ కాలరాశారు: యనమల

AP: జగన్ పాలనలో అసెంబ్లీ కార్యక్రమాలను నిర్వీర్యం చేశారని TDP నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. భావప్రకటనా స్వేచ్ఛను కాలరాశారని ఆరోపించారు. 15వ అసెంబ్లీ ఐదేళ్లలో ఈశాన్య రాష్ట్రాల కంటే 78 రోజులు తక్కువగా పనిచేసిందన్నారు. ప్రతిపక్ష భాగస్వామ్యం లేకుండానే 193 బిల్లులను ఆమోదించిందని దుయ్యబట్టారు. అమరావతి రాజధానికి సంబంధించిన బిల్లులను శాసనమండలిలో తిరస్కరించడం అప్పటి విపక్షం సాధించిన గొప్ప ఘనతన్నారు.
Similar News
News December 30, 2025
మీ పార్టీలు సరే.. ఇంట్లో వాళ్ల సంగతేంటి?

కొన్ని గంటల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. న్యూఇయర్ అంటే తెలుగు రాష్ట్రాల్లో ధూంధాం పార్టీలుంటాయి. పబ్బులు, బార్లు, దోస్తులతో DEC 31st నైట్ ఎంజాయ్ చేస్తారు. పురుషులంతా వారి ఫ్రెండ్స్తో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని ఇప్పటికే ప్లాన్స్ కూడా చేసుకుని ఉంటారు. అయితే ఇంట్లో ఉండే వాళ్ల సంగతేంటి? అదే ఇంట్లో ఉన్న అమ్మ, అక్క, చెల్లి, భార్య.. వాళ్లకి కూడా కొత్త సంవత్సరమే కదా. వారి గురించి ఏమైనా ఆలోచించారా?
News December 30, 2025
హర్మన్ కెప్టెన్ ఇన్నింగ్స్.. భారత్ స్కోర్ ఎంతంటే?

శ్రీలంక ఉమెన్స్ టీమ్తో జరుగుతున్న 5వ టీ20లో భారత్ 175/7 రన్స్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇండియా 77 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయింది. దీంతో కెప్టెన్ హర్మన్ప్రీత్ 43 బంతుల్లో 68 రన్స్ చేసి ఆదుకున్నారు. చివర్లో అరుంధతీ రెడ్డి బౌండరీలతో చెలరేగారు. ఆమె 11 బంతుల్లో 27* రన్స్తో రాణించారు.
News December 30, 2025
వాస్తు రహస్యం: ఇంటి బ్రహ్మస్థానం ప్రాముఖ్యత

ఇంటికి మధ్యభాగమైన బ్రహ్మస్థానంలో ఏ బరువు ఉండకూడదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘ఇది ఇంటికి నాభి వంటిది. ఇక్కడి నుంచే సానుకూల శక్తి నలువైపులా ప్రసరిస్తుంది. ఈ భాగం ఖాళీగా, శుభ్రంగా, వెలుతురుతో ఉండాలి. గోడలు, స్తంభాలు, బరువులు ఉంచకూడదు. ఒకప్పుడు ఇక్కడ ఆకాశం కనిపించేలా ముంగిలి వదిలేవారు. ఈ స్థానాన్ని పవిత్రంగా ఉంచితే ఇంట్లో ఆరోగ్యం, అభివృద్ధి, ప్రశాంతత లభిస్తాయి’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>


