News April 17, 2025
జగన్ ఆస్తుల కేసు.. దాల్మియా సిమెంట్స్ ఆస్తులు సీజ్!

YS జగన్ అక్రమాస్తుల కేసులో దాల్మియా సిమెంట్స్కు చెందిన ₹793 కోట్ల ఆస్తులను ED జప్తు చేసినట్లు తెలుస్తోంది. అందులో ₹377 కోట్ల విలువైన భూమి ఉంది. భారతీ సిమెంట్స్లో క్విడ్ ప్రోకో జరిగిందని.. పునీత్ దాల్మియా, విజయసాయికి మధ్య డీల్ కుదిరిందని తేల్చినట్లు సమాచారం. భారతీ సిమెంట్స్లో దాల్మియా పెట్టుబడులు పెట్టడం ద్వారా వచ్చిన లాభంలో రూ.55 కోట్లు 2010-11 మధ్య జగన్కు బదిలీ చేశారని గతంలో CBI ఆరోపించింది.
Similar News
News April 20, 2025
IPL: టాస్ గెలిచిన RCB

ముల్లాన్పూర్లో PBKSvsRCB మ్యాచ్లో RCB టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మొన్న తమ సొంత గ్రౌండ్లో వర్షం కారణంగా కుదించిన మ్యాచ్లో RCB ఓటమిపాలైంది. దీంతో ఈ మ్యాచ్ పోటాపోటీగా ఉండొచ్చు.
PBKS: ప్రభ్సిమ్రన్, ప్రియాంశ్, అయ్యర్, ఇంగ్లిస్, వధేరా, శశాంక్, స్టొయినిస్, జాన్సెన్, బార్ట్లెట్, అర్షదీప్, చాహల్
RCB: సాల్ట్, కోహ్లీ, పటీదార్, రొమారియో, జితేశ్, డేవిడ్, క్రునాల్, భువీ, హేజిల్వుడ్, దయాళ్, సుయాశ్
News April 20, 2025
విమానాన్ని ఢీకొట్టిన టెంపో వ్యాన్!

బెంగళూరు ఎయిర్పోర్టులో నిలిచి ఉన్న ఇండిగో విమానాన్ని ఓ టెంపో వ్యాన్ ఢీకొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. విమానం కింద వ్యాన్ ఇరుక్కున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఘటనపై ఇండిగో స్పందించింది. ‘బెంగళూరులో జరిగిన ఘటన మా దృష్టికి వచ్చింది. దర్యాప్తు జరుగుతోంది. అది పూర్తైన అనంతరం తగిన చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొంది. టెంపో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
News April 20, 2025
వర్షం మొదలైంది..

TG: హైదరాబాద్ శివారు ప్రాంతాలైన మేడ్చల్, తుర్కపల్లి, శామీర్పేట, ఆలియాబాద్, తూముకుంట, కీసరలో వర్షం పడుతోంది. రాబోయే గంట నుంచి రెండు గంటల్లో HYDతో పాటు నాగర్ కర్నూల్, రంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.