News September 8, 2024

బురద రాజకీయాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్: లోకేశ్

image

AP: జనం వరదల్లో ఉంటే జగన్ ప్యాలెస్‌లో రిలాక్స్ అవుతున్నారని మంత్రి లోకేశ్ విమర్శించారు. బురద రాజకీయాలకి ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని దుయ్యబట్టారు. పాస్‌పోర్ట్ సమస్య లేకుంటే ఎప్పుడో లండన్ వెళ్లేవారన్నారు. గత వైసీపీ ప్రభుత్వం బుడమేరు పనులను నిలిపివేసి విపత్తుకు కారణమైందని మండిపడ్డారు. బుడమేరు ఆధునీకరణకు కూటమి ప్రభుత్వం రూ.464 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.

Similar News

News November 13, 2025

ప్రహారీ దాటి ఇంటి నిర్మాణాలు ఉండొచ్చా?

image

ఇంటిని, ర్యాంపులను ప్రహరీ దాటి బయటికి నిర్మించడం సరికాదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. రహదారిపైకి వచ్చేలా ర్యాంపులు కట్టడం వల్ల వీధుల్లో తిరిగే ప్రజలకు, వాహనాలకు అసౌకర్యం కలుగుతుందంటున్నారు. ‘వాస్తుకు అనుగుణంగా ఇంటి గేటు లోపలే ర్యాంపు ఉండాలి. ప్రజలకు చెందాల్సిన రహదారిని ఆక్రమించడం ధర్మం కాదు. ప్రహరీ లోపల నిర్మాణాలు చేస్తేనే వాస్తు ఫలితం సంపూర్ణంగా లభిస్తుంది’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>

News November 13, 2025

పంట ఉత్పత్తుల సేకరణ నిబంధనలు సడలించాలి: తుమ్మల

image

TG: వర్షాల ప్రభావం పడిన సోయాబీన్, మొక్కజొన్న, పత్తి సేకరణ నిబంధనలు సడలించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, గిరిరాజ్ సింగ్‌కు లేఖ రాశారు. పంట ఉత్పత్తులు సేకరించేలా NAFED, NCCFలను ఆదేశించాలన్నారు. ఎకరానికి 7 క్వింటాళ్లు మాత్రమే సేకరించాలన్న CCI ప్రతిపాదనతో రైతులు నష్టపోతారని తుమ్మల ఆందోళన వ్యక్తం చేశారు. L1, L2, స్పాట్ బుకింగ్‌లతో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.

News November 13, 2025

విశాఖలో 99పైసలకే రహేజాకు 27.10 ఎకరాలు

image

AP: VSP IT సెక్టార్లో 27.10 ఎకరాలు కేవలం 99 పైసలకే ‘రహేజా’కు ఇస్తూ ప్రభుత్వం GO ఇచ్చింది. అదనంగా ఆర్థిక రాయితీలు ఇస్తామంది. పైగా ₹91.20CRతో రోడ్లు, నీరు, విద్యుత్తు సౌకర్యాలు కల్పిస్తామంది. కాగా ₹2172.26 CRతో ఐటీ, రెసిడెన్షియల్ స్పేస్ నిర్మిస్తామని, 9681 జాబ్‌లు కల్పిస్తామని కంపెనీ చెబుతోంది. ₹కోట్ల విలువైన భూమిని సదుపాయాలు కల్పించి మరీ 99 పైసలకే ‘రియల్’ సంస్థకు ఇవ్వడంపై అనేక ప్రశ్నలొస్తున్నాయి.