News September 8, 2024

బురద రాజకీయాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్: లోకేశ్

image

AP: జనం వరదల్లో ఉంటే జగన్ ప్యాలెస్‌లో రిలాక్స్ అవుతున్నారని మంత్రి లోకేశ్ విమర్శించారు. బురద రాజకీయాలకి ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని దుయ్యబట్టారు. పాస్‌పోర్ట్ సమస్య లేకుంటే ఎప్పుడో లండన్ వెళ్లేవారన్నారు. గత వైసీపీ ప్రభుత్వం బుడమేరు పనులను నిలిపివేసి విపత్తుకు కారణమైందని మండిపడ్డారు. బుడమేరు ఆధునీకరణకు కూటమి ప్రభుత్వం రూ.464 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.

Similar News

News January 6, 2026

‘రాజాసాబ్’ రన్ టైమ్ ఫిక్స్.. టికెట్ ధరలు పెరిగేనా?

image

ప్రభాస్, మారుతి కాంబినేషన్లో రూపొందిన ‘రాజాసాబ్’ మూవీకి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. సినిమా నిడివి 3 గంటల 9 నిమిషాలుగా పేర్కొంది. మరోవైపు సెన్సార్ సర్టిఫికెట్ రావడంతో టికెట్ ధరల పెంపునకు అనుమతివ్వాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు నిర్మాణ సంస్థ లేఖ రాసింది. దీనిపై <<18543073>>TG ప్రభుత్వం<<>> ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ నెల 9న మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.

News January 6, 2026

ECILలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

image

HYDలోని <>ECIL<<>> 20 టెక్నీషియన్, సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు నేటి నుంచి జనవరి 20 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఐటీఐ, డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, స్కిల్/ట్రేడ్ టెస్ట్+వైవా ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.ecil.co.in

News January 6, 2026

ఈ చేప ఖరీదు రూ.28కోట్లు!

image

టోక్యోలోని టొయోసు మార్కెట్‌లో నిర్వహించిన వేలంలో ఒక బ్లూఫిన్ ట్యూనా చేప రికార్డు ధర పలికింది. 243kgs బరువున్న ఈ చేపను సుమారు రూ.28Crకు ($3.2M) ఓ రెస్టారెంట్ యజమాని దక్కించుకున్నారు. జపాన్‌లోని ‘Oma’ తీరంలో దొరికిన ఇలాంటి చేపలు రుచికరంగా ఉంటాయని పేరుంది. అలాగే అక్కడి సంప్రదాయం ప్రకారం న్యూఇయర్ తొలి వేలంలో అత్యధిక ధరకు చేపను కొంటే అదృష్టమని భావిస్తారు. అందుకే వ్యాపారులు ఎంత ఖర్చయినా వెనకాడరు.