News April 24, 2024

రేపటితో ముగియనున్న జగన్ బస్సు యాత్ర

image

AP: గత నెల 27న ప్రారంభమైన సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర రేపటితో ముగియనుంది. రేపు ఉదయం 9 గంటలకు అక్కివలస నుంచి బయల్దేరి.. ఎచ్చెర్ల, కుశాలపురం, శ్రీకాకుళం బైపాస్, పలివలస, నరసన్నపేట, గట్లపాడు, వండ్రాడ, ఎత్తురాళ్లపాడు, కోటబొమ్మాళి మీదుగా పరుశురాంపురం చేరుకుంటారు. అనంతరం అక్కవరం బహిరంగ సభలో జగన్ ప్రసంగం అనంతరం ఈ యాత్ర ముగియనుంది. ఆ తర్వాత సీఎం తాడేపల్లికి బయల్దేరి వెళ్లనున్నారు.

Similar News

News November 27, 2025

సారంగాపూర్: ‘ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా నిర్వహించాలి’

image

సారంగాపూర్ మండలం కోనాపూర్, అర్పపల్లి, ధర్మానాయక్ తండా, రంగపేట, నాగునూర్, లచ్చక్కపేటలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ బీ.ఎస్.లత ఆకస్మికంగా పరిశీలించారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు వేగంగా చేయాలని ఆదేశించారు. 17% తేమ ఉన్నా సన్న, దొడ్డు రకాలు తప్పనిసరిగా కొనాలన్నారు.

News November 27, 2025

పాక్ న్యూక్లియర్ కంట్రోల్స్ ఆసిమ్ మునీర్ చేతికి!

image

పాకిస్థాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ఆ దేశ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్‌(CDF)గా బాధ్యతలు చేపట్టారు. అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌కు అతను అధిపతిగా ఉంటారు. ఆ దేశ ప్రధానికి సరిసమానమైన పవర్స్ మాత్రమే కాదు లీగల్ ప్రొటెక్షన్ కూడా ఆసిమ్ మునీర్‌కు ఉంటుందని చెబుతున్నారు. అతనికి కేసుల నుంచి లైఫ్ టైమ్ ఇమ్యూనిటీతో పాటు న్యూక్లియర్ వెపన్స్ కంట్రోల్స్ కూడా అతని చేతికే ఇస్తారని తెలుస్తోంది.

News November 27, 2025

వారికి నిద్ర అవసరం: సుందర్ పిచాయ్

image

‘జెమిని 3’ మోడల్‌ కోసం తన బృందం కొన్ని వారాల పాటు విరామం లేకుండా పని చేసిందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. ‘ఉద్యోగులంతా ఎంతో అలసిపోయారు. కొందరికి నిద్ర అవసరం. ఇప్పుడు తగిన విశ్రాంతి దొరుకుతుందని ఆశిస్తున్నా’ అని చెప్పారు. ‘గూగుల్ ఏఐ: రిలీజ్ నోట్స్’ పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడారు. జెమిని 3 ఏఐ మోడల్‌ను ఇటీవల గూగుల్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.