News July 25, 2024

ఏపీకి పెట్టుబడులు రాకుండా జగన్ కుట్ర: హోం మంత్రి

image

APలో ఇప్పటికీ TDP కార్యకర్తలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని అసెంబ్లీలో హోంమంత్రి అనిత అన్నారు. ‘రాష్ట్రంలో 36 హత్యలు జరిగాయని ఢిల్లీలో చెప్పిన జగన్ మృతుల పేర్లను మాత్రం చెప్పలేకపోయారు. అసెంబ్లీకి వచ్చి ఆ పేర్లు చెప్పే దమ్ము జగన్‌కు లేదా? APకి పెట్టుబడులు రాకుండా జగన్ కుట్ర చేస్తున్నారు. హత్యలపై వివరాలందిస్తే తగిన విచారణ చేయిస్తాం. తప్పుడు వివరాలిచ్చినట్లు తేలితే చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించారు.

Similar News

News October 18, 2025

DDAలో 1,732 పోస్టులు.. అప్లై చేశారా?

image

ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ 1,732 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు నవంబర్ 5వరకు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష(స్టేజ్1, స్టేజ్ 2), ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, Jr ఇంజినీర్, SO, స్టెనోగ్రాఫర్, JSA, మాలి, MTS తదితర పోస్టులు ఉన్నాయి. వెబ్‌సైట్: https://dda.gov.in/. మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News October 18, 2025

వివరాలు ఇవ్వకపోతే ఈనెల జీతం రాదు: ఆర్థిక శాఖ

image

TG: ఆధార్, ఫోన్ నంబర్లను ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయని ఉద్యోగులకు ఈనెల జీతం రాదని ఆర్థిక శాఖ హెచ్చరించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో అక్రమాలను అరికట్టేందుకు సమగ్ర సమాచారం కోసం ప్రతినెల 10లోపు ఉద్యోగుల ఆధార్, ఫోన్ నంబర్లను నమోదు చేయాలని గతనెల ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇప్పటివరకు 5.21లక్షల రెగ్యులర్ ఉద్యోగుల్లో 2.22లక్షల మంది, 4.93లక్షల ఒప్పంద సిబ్బందిలో 2.74లక్షల మంది మాత్రమే వివరాలు అందించారు.

News October 18, 2025

సహజంగా పరిమళాలు అద్దేద్దాం..

image

ఎక్కడికైనా వెళ్లడానికి రెడీ అవ్వడం అంటే మేకప్, మంచి డ్రెస్ చివరిగా ఫెర్ఫ్యూమ్ వేసుకుంటాం. కానీ వీటిలో ఉండే రసాయనాల వల్ల దుస్తులపై మరకలు పడటంతో పాటు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఇలా కాకుండా కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ వాడితే రసాయనాలు లేకుండా సహజసిద్ధ పరిమళాలను ఆస్వాదించొచ్చంటున్నారు నిపుణులు. వాటిల్లో లావెండర్, మింట్, గంధం నూనె, రోజ్ ఆయిల్ వంటివి మంచి స్మెల్‌ని ఇస్తూనే ఆరోగ్యాన్నీ కాపాడతాయి.