News April 14, 2024
జగన్కు ప్రమాదం తప్పింది: కేశినేని నాని

AP: జగన్కు అదృష్టవశాత్తు ప్రమాదం తప్పిందని విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలిపారు. ‘చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్పై దాడి వెనుక పెద్ద కుట్ర ఉంది. బోండా ఉమ రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారు. జగన్పై దాడికి చంద్రబాబు, లోకేశ్, బోండా ఉమానే కారణం. విజయవాడలో అల్లర్లు సృష్టించాలన్నదే వారి కుట్ర. దాడి ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలి’ అని డిమాండ్ చేశారు.
Similar News
News March 24, 2026
రైతులకు రుణమాఫీ ప్రతిపాదన లేదు: కేంద్రం

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద రైతు రుణమాఫీ చేసే ప్రతిపాదన లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. రుణమాఫీ కంటే కూడా రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా ఇచ్చే సాయం, PM కిసాన్ నిధులు, తక్కువ వడ్డీకే లోన్లు అందించడం వంటి చర్యల ద్వారా వ్యవసాయాన్ని బలోపేతం చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. పూచీకత్తు లేని లోన్ల పరిమితిని ₹2 లక్షలకు పెంచామని వివరించారు.
News March 24, 2026
నేడే గురుకుల సెట్ ఫలితాలు

TG: గురుకులాల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన TGSET-2026 ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 1:30 గంటలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ రిజల్ట్స్ను అనౌన్స్ చేస్తారు. SC, ST, BC, జనరల్ గురుకులాల్లో 5వ తరగతితో పాటు 6 నుంచి 9వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ పరీక్ష నిర్వహించారు. ఈ ఏడాది ఏకంగా 1,72,842 మంది విద్యార్థులు ఈ ఎంట్రన్స్ టెస్ట్ రాశారు. అధికారిక వెబ్సైట్లో రిజల్ట్స్ చూసుకోవచ్చు.
News March 24, 2026
వరిలో కంకి నల్లిని ఎలా నివారించాలి?

వరి పైరులో గింజ పాలుపోసుకునే దశలో కంకి నల్లి ఆశిస్తుంది. వీటి వల్ల ఆకులపై పసుపు రంగు చారలు ఏర్పడతాయి. క్రమేపీ ఇవి నల్లగా మారతాయి. గింజలపై కూడా నల్లటి మచ్చలు కనిపిస్తాయి. దీనివల్ల గింజలు పాలు పోసుకోకుండా తాలుగా మారి పంట దిగుబడి 20-30% తగ్గే అవకాశం ఉంది. కంకినల్లి నివారణకు లీటరు నీటికి ప్రొఫెనోఫాస్ 2ml లేదా స్పెరోమెసిఫిన్ 1ml కలిపి 15 రోజుల వ్యవధిలో మందుమార్చి 2 సార్లు పిచికారీ చేయాలి.


