News April 18, 2024

‘సిద్ధం’ పేరుతో జగన్ డ్రామాలు: షర్మిల

image

AP: సీఎంగా జగన్ మనకు అవసరమా అని PCC చీఫ్ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ‘పెద్ద కోటల్లో నివసించే జగన్.. ఎన్నికలు వస్తున్నాయని ఇప్పుడు సిద్ధం పేరుతో డ్రామాలు ఆడుతున్నారు. వైఎస్ఆర్ హయాంలో ప్రజాదర్బార్ ఉండేది. జగన్ పాలనలో ఎందుకు లేదు? సొంత ప్రయోజనాల కోసం జగన్ కేంద్రం వద్ద ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. హోదా ఇచ్చేది కాంగ్రెస్ మాత్రమే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఆశీర్వదించండి’ అని ఆమె కోరారు.

Similar News

News November 22, 2025

నౌహీరా షేక్ రూ.19.64 కోట్ల ఆస్తి వేలం

image

TG: హీరా గ్రూప్ అధినేత నౌహీరా షేక్ అక్రమార్జన కేసులో ED కీలక చర్యలు చేపట్టింది. ఆమెకు చెందిన రూ.19.64 కోట్ల విలువైన ఆస్తిని వేలం వేసి విక్రయించి రిజిస్ట్రేషన్ పూర్తి చేసింది. నౌహీరా షేక్ అధిక లాభం ఇస్తామంటూ ప్రజల నుంచి రూ.5,978 కోట్ల పెట్టుబడులు సేకరించి మోసగించారు. ఇప్పటివరకు రూ.428 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని బాధితులకు పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు.

News November 22, 2025

నేడు పుట్టపర్తికి రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి

image

AP: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ ఇవాళ సత్యసాయి(D) పుట్టపర్తికి వెళ్లనున్నారు. ప్రశాంతి నిలయంలో జరిగే సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఉ.11 గంటలకు ముర్ము అక్కడికి చేరుకోనున్నారు. ఎయిర్‌పోర్టులో CM చంద్రబాబు స్వాగతం పలకనున్నారు. మ.3.40గంటలకు రాధాకృష్ణన్ చేరుకుంటారు. సత్యసాయి యూనివర్సిటీ 44వ స్నాతకోత్సవానికి రాధాకృష్ణన్, చంద్రబాబు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.

News November 22, 2025

పెళ్లి చేసుకుంటున్నారా? శ్రీవారి కానుక అందుకోండిలా..

image

పెళ్లి చేసుకునేవారికి TTD ఓ అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. నూతన దంపతులకు వేంకటేశ్వరస్వామి ఆశీర్వచనంతో కూడిన మహా ప్రసాదం, కల్యాణ తలంబ్రాలు, కుంకుమ, కంకణాలను ఉచితంగా పంపిస్తుంది. అందుకోసం వివాహ తొలి శుభలేఖను కార్యనిర్వహణాధికారి, టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్, తిరుపతి చిరునామాకు పంపితే చాలు. వివాహానికి ఓ నెల ముందు పత్రిక పంపితే, స్వామివారి ప్రసాదం వివాహ సమయానికి అందుతుంది.