News June 25, 2024

పాసు పుస్తకాలపై జగన్ బొమ్మ తీసేస్తా: చంద్రబాబు

image

AP: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల భూములను కొట్టేసే కుట్ర అని సీఎం చంద్రబాబు అభివర్ణించారు. ‘ఆ యాక్ట్ సరైనది కాదని దాన్ని రద్దు చేశాం. మీరు కష్టపడి సంపాదించుకున్న భూమికి చెందిన పట్టా పాసు పుస్తకంపై జగన్ బొమ్మ వేసుకున్నారు. త్వరలోనే వాటిపై జగన్ బొమ్మ తీసేస్తా. రాజముద్రతో కొత్త పుస్తకాలు ముద్రించి ఇస్తా’ అని కుప్పం సభలో CM ప్రకటించారు.

Similar News

News January 25, 2026

రాష్ట్రాభివృద్ధిలో ఎంపీల భాగస్వామ్యం కీలకం: సీఎం

image

AP: కేంద్ర బడ్జెట్‌లో ఏపీ ప్రాజెక్టులకు నిధులు సాధించాలని ఎంపీలకు సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్రాభివృద్ధిలో ఎంపీల భాగస్వామ్యం కీలకంగా ఉండాలన్నారు. ఉత్తరాంధ్ర-రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజ్, పూర్వోదయ పథకం, పోలవరం-నల్లమల సాగర్, అమరావతికి చట్టబద్ధతను ప్రాధాన్యతాంశాలుగా తీసుకోవాలని చెప్పారు. కేంద్ర మంత్రులు, అధికారులతో టచ్‌లో ఉండాలని పేర్కొన్నారు. సభలో ప్రతి ఒక్కరూ మాట్లాడాలని సూచించారు.

News January 25, 2026

మూడో టీ20.. భారత్ టార్గెట్ ఎంతంటే?

image

టీమ్ ఇండియాతో మూడో టీ20లో న్యూజిలాండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. NZ బ్యాటర్లు ఫిలిప్స్(48), చాప్‌మన్(32) ఫర్వాలేదనిపించడంతో మోస్తరు స్కోరు చేసింది. ఓపెనర్ కాన్వే(1), రవీంద్ర(4) విఫలమయ్యారు. భారత బౌలర్లలో బుమ్రా 3, బిష్ణోయ్, హార్దిక్ తలో రెండు, హర్షిత్ రానా ఒక వికెట్ తీశారు. టీమ్ ఇండియా టార్గెట్ 154.

News January 25, 2026

ఇంట్లో అద్దం ఏ వైపున ఉండాలంటే..?

image

అద్దాలు సరైన దిశలో ఉంటేనే ఇల్లు దోషరహితం అవుతుందని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. అద్దాలు తూర్పు, తూర్పు-ఈశాన్యం, ఉత్తర-ఈశాన్యం గోడలకు అమర్చాలని సూచిస్తున్నారు. అలా ఉండటమే శ్రేయస్కరం అంటున్నారు. ‘వీటి వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. దీర్ఘచతురస్ర, వృత్తాకార అద్దాలు ఉత్తమం. పగిలిన అద్దాలు ఉంచకూడదు. వీటిని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. అప్పుడే వాస్తు బలం చేకూరుతుంది’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>