News June 25, 2024

పాసు పుస్తకాలపై జగన్ బొమ్మ తీసేస్తా: చంద్రబాబు

image

AP: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల భూములను కొట్టేసే కుట్ర అని సీఎం చంద్రబాబు అభివర్ణించారు. ‘ఆ యాక్ట్ సరైనది కాదని దాన్ని రద్దు చేశాం. మీరు కష్టపడి సంపాదించుకున్న భూమికి చెందిన పట్టా పాసు పుస్తకంపై జగన్ బొమ్మ వేసుకున్నారు. త్వరలోనే వాటిపై జగన్ బొమ్మ తీసేస్తా. రాజముద్రతో కొత్త పుస్తకాలు ముద్రించి ఇస్తా’ అని కుప్పం సభలో CM ప్రకటించారు.

Similar News

News January 27, 2026

మెదక్ జిల్లాలో విషాదం

image

మెదక్ జిల్లా రేగోడ్ మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ ఎస్ఐ బత్తిని బ్రహ్మయ్య సోమవారం అర్ధరాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. పోలీస్ శాఖలో క్రమశిక్షణ, కర్తవ్యనిష్ఠకు ఆయన చిరునామాగా నిలిచారు. సుదీర్ఘ సేవా కాలంలో ప్రజల విశ్వాసాన్ని సంపాదించి ఆదర్శ అధికారిగా గుర్తింపు పొందారు. ఆయన మరణ వార్తతో రేగోడ్ మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బ్రహ్మయ్య సేవలను పలువురు ప్రజాప్రతినిధులు, సహోద్యోగులు స్మరించుకున్నారు‌.

News January 27, 2026

గ్రూప్‌-2 ఫలితాలకు మోక్షం ఎప్పుడో?

image

AP: గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ ప్రక్రియ నత్తనడకన సాగుతూ అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తోంది. 2023 DECలో 905 పోస్టులతో నోటిఫికేషన్‌ రాగా, ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయినా తుది ఫలితాలు విడుదల చేయలేదు. కోర్టు కేసులు, రోస్టర్‌, స్పోర్ట్స్ కోటా అంశాలు అడ్డంకులుగా మారాయి. ఇటీవల హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినా APPSC నిర్ణయం తీసుకోలేదు. ఈలోగా మళ్లీ కొత్త కేసులు పుట్టుకొచ్చాయి.

News January 27, 2026

యూనివర్సిటీల్లో 2,125 ఖాళీలు!

image

TG: యూనివర్సిటీల్లో 2,878 పోస్టులకు 753 మందే రెగ్యులర్ ఉద్యోగులు ఉండగా 2,125 ఖాళీలు ఉన్నాయి. కాంట్రాక్టు, గెస్ట్ లెక్చరర్లతో నిర్వహణ సాగుతోంది. పోస్టుల భర్తీకి 2018లో అనుమతిచ్చినా ప్రక్రియ పూర్తి కాలేదు. నియామకాల్లో తమకు న్యాయం చేయాలన్న కాంట్రాక్టు లెక్చరర్ల ఆందోళనతో ప్రక్రియ నిలిచిపోయింది. ఖాళీల భర్తీకి విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిందని సమాచారం. చివరగా 2013లో నియామకాలు జరిగాయి.