News April 7, 2024
ఆ జాబితాలో జగన్ది మొదటి స్థానం: లోకేశ్

AP: సొంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయని సీఎంల జాబితాలో జగన్ మొదటి స్థానంలో ఉంటారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి అప్పులకుప్పగా మార్చారని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి రాగానే అమరావతి, పోలవరం పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో పాటు ఉద్యోగులకు రావాల్సిన బకాయిలన్నీ అందిస్తామని తెలిపారు.
Similar News
News December 5, 2025
‘విద్యార్థులు చదువుతోపాటు ఆటల్లోనూ రాణించాలి’

విద్యార్థులు చదువుతోపాటు ఆటల్లోనూ రాణించాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్ పిలుపునిచ్చారు. కేంద్రీయ విద్యాలయం వార్షిక ఆటల పోటీలు 2025-26 కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇన్ఛార్జ్ కలెక్టర్ హాజరయ్యారు. ఆమెకు స్కౌట్స్ అండ్ గైడ్స్ స్వాగతం పలికింది. ఆటల పోటీల జెండాను ఆవిష్కరించి ప్రోగ్రాంను ప్రారంభించారు. విద్యార్థుల నృత్యాలు, ప్రదర్శనలు అలరించాయి.
News December 5, 2025
నాలుగు వేదాల ప్రతీక ‘తిరుమాడ వీధులు’

తిరుమల శ్రీవారి ఆలయం చుట్టూ 4 దిక్కులా ఉన్న వీధులను తిరుమాడ వీధులు అంటారు. వీటిని 4 వేదాలకు ప్రతీకగా భావిస్తారు. భగవద్రామానుజులవారు స్వామివారి ఊరేగింపుల కోసం వీటిని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారి వాహన సేవలు ఈ పవిత్ర వీధులలోనే వైభవంగా జరుగుతాయి. వీటి పవిత్రత కారణంగా, ఈ మాడ వీధుల్లో పాదరక్షలు ధరించడం నిషేధం. ఈ వీధులు స్వామివారి వైభవాన్ని లోకానికి చాటిచెబుతాయి. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News December 5, 2025
పండ్లు, కూరగాయలపై పురుగు మందుల అవశేషాలు ఇలా దూరం

పండ్లు, కూరగాయలను వండే ముందు, తినే ముందు తప్పనిసరిగా నీటితో కడగాలి. కాస్త ఉప్పు లేదా వెనిగర్ లేదా పసుపు కలిపిన నీటిలో కాసేపు ఉంచి కడిగితే పండ్లు, కూరగాయలపై చేరిన పురుగు మందుల అవశేషాలను తొలగించవచ్చు. కొన్ని పురుగు మందులు వాటి గాఢతను బట్టి కూరగాయల ఉపరితలం నుంచి తొక్క లోపలి పొరల వరకు చొచ్చుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి తినడానికి ముందు తొక్క తొలగించి తీసుకోవడం మరింత మంచిది.


