News April 7, 2024

ఆ జాబితాలో జగన్‌ది మొదటి స్థానం: లోకేశ్

image

AP: సొంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయని సీఎంల జాబితాలో జగన్ మొదటి స్థానంలో ఉంటారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి అప్పులకుప్పగా మార్చారని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి రాగానే అమరావతి, పోలవరం పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో పాటు ఉద్యోగులకు రావాల్సిన బకాయిలన్నీ అందిస్తామని తెలిపారు.

Similar News

News December 24, 2025

పద్మ అవార్డులు పేర్ల ముందు, వెనుక ఉంచొద్దు: బాంబే హైకోర్టు

image

‘పద్మ’ అవార్డులను పేర్ల ముందు, వెనుక వినియోగించుకోరాదని బాంబే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. పద్మ అవార్డీ శరద్ హార్దికర్ కేసులో కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. ఆయా రంగాల్లో చేసిన కృషి, సామాజిక సేవకు గుర్తింపుగా ప్రభుత్వం ఈ అవార్డులు అందిస్తోందని, దీన్ని గౌరవంగా భావించాలే తప్ప టైటిల్‌గా కాదని స్పష్టం చేసింది. కాగా దీనిపై సుప్రీంకోర్టు గతంలోనే తీర్పు ఇచ్చింది. అయినా కొందరు పట్టించుకోవడం లేదు.

News December 24, 2025

ఒంటరిగా గెలవలేకే ఉద్ధవ్ సోదరులు కలిశారు: మహా CM

image

రష్యా, ఉక్రెయిన్ శాంతి చర్చలు జరుగుతున్న రేంజ్‌లో వారి కలయికను <<18657891>>ఉద్ధవ్ సోదరులు<<>> చూపుతున్నారని మహారాష్ట్ర CM ఫడణవీస్ ఎద్దేవా చేశారు. బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడిన శివ్ సేన (UBT), మహారాష్ట్ర నవ్‌నిర్మాణ సేన (MNS) కలయిక వల్ల ప్రజలకు ప్రయోజనం ఉండదన్నారు. సిద్ధాంతాలు పక్కనపెట్టి రాజకీయ ప్రయోజనాల కోసమే కలిశారని చెప్పారు. ఈ 2 పార్టీలు విడివిడిగా పోటీ చేసి గెలవలేవని తేలిపోయిందన్నారు.

News December 24, 2025

కుంభమేళా to ఇండిగో గందరగోళం: 2025లో కీలక ఘటనలు

image

ఈ ఏడాది మహా కుంభమేళాతో మొదలైంది. పహల్గామ్ దాడి, ఢిల్లీ ఎర్రకోట పేలుడు భయాందోళనలు రేపాయి. బదులుగా భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టి పాక్ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఆర్థికంగా ట్రంప్ టారిఫ్స్ షాకిచ్చినా, మోదీ పర్యటన వల్ల చైనాతో సంబంధాలు మెరుగుపడ్డాయి. జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా, జీఎస్టీ సంస్కరణలు, నక్సల్స్ ఏరివేత ప్రధాన వార్తలుగా నిలిచాయి. చివరగా ఇండిగో విమానాల రద్దు వేలమందిని ఇబ్బంది పెట్టింది.