News April 7, 2024

ఆ జాబితాలో జగన్‌ది మొదటి స్థానం: లోకేశ్

image

AP: సొంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయని సీఎంల జాబితాలో జగన్ మొదటి స్థానంలో ఉంటారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి అప్పులకుప్పగా మార్చారని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి రాగానే అమరావతి, పోలవరం పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో పాటు ఉద్యోగులకు రావాల్సిన బకాయిలన్నీ అందిస్తామని తెలిపారు.

Similar News

News December 21, 2025

ప్రజల ఆస్తుల విలువ పూర్తిగా తగ్గింది: KCR

image

TG: ఒకప్పుడు యూరియా ఇంటికి, చేను వద్దకు వచ్చేదని, ఇప్పుడు కుటుంబమంతా లైన్‌లో నిలబడే పరిస్థితి వచ్చిందని కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకం ప్రకటించకపోగా ఉన్న వాటిని ఆపేసిందన్నారు. రాష్ట్రంలో ప్రజల ఆస్తుల విలువ పూర్తిగా తగ్గిందని BRS సమావేశంలో తెలిపారు. రైతులకు నీటిని అందించేందుకు నిర్మించిన చెక్‌డ్యామ్‌లను పేల్చివేస్తున్నారని మండిపడ్డారు.

News December 21, 2025

త్వరలో ‘ఆంధ్రా టాక్సీ’ యాప్

image

AP: ప్రైవేట్ క్యాబ్ సంస్థల అధిక ఛార్జీలకు చెక్ పెట్టేందుకు ‘ఆంధ్రా టాక్సీ’ పేరుతో ప్రభుత్వం కొత్త యాప్‌ను తీసుకొస్తోంది. తక్కువ ధరకే ఆటో, టాక్సీ సేవలు అందించడమే లక్ష్యంగా దీనిని రూపొందించారు. తొలుత NTR జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా సేవలు ప్రారంభించనున్నారు. దీంతో పర్యాటక ప్రాంతాలకు తక్కువ ధరతో ప్రయాణించొచ్చు. ఈ యాప్‌ను NTR జిల్లా యంత్రాంగమే పర్యవేక్షిస్తుందని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.

News December 21, 2025

ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది: KCR

image

TG: పంచాయతీ ఎన్నికల్లో BRS మెరుగైన ఫలితాలు సాధించిందని కేసీఆర్ అన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని, గర్వంతో ఎగిరే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రజలు బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు అహంకారం ప్రదర్శించలేదన్నారు. పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలైతే BRS సత్తా తెలిసేదని తెలిపారు. తనను తిట్టడం, తాను చనిపోవాలని శాపాలు పెట్టడమే ఈ ప్రభుత్వ విధానం అని విమర్శించారు.