News November 7, 2024

మధ్యాహ్నం జగన్ కీలక ప్రెస్‌మీట్

image

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా శ్రేణులపై నమోదవుతున్న కేసులపై స్పందించే అవకాశం ఉంది. ఈ కేసులపై సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై ప్రకటన చేస్తారని తెలుస్తోంది. కాగా వారం రోజుల్లోనే 107 మందిపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని వైసీపీ ఆరోపిస్తోంది.

Similar News

News November 16, 2025

బీజేపీకి ఓటు వేస్తేనే హిందువులా?.. MLAపై నెటిజన్ల ఫైర్

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓటమి తర్వాత ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ‘ఓడిపోయాం అంతే చచ్చిపోలేదు. బీజేపీకి ఓటు వేసిన 17,056 మంది కట్టర్ హిందూ బంధువులకు ధన్యవాదాలు. కనీసం మీరైనా హిందువులుగా బతికి ఉన్నందుకు గర్వపడుతున్నా. జై హిందుత్వ’ అని పేర్కొన్నారు. బీజేపీకి ఓటు వేస్తేనే హిందువులా.. ఓటు వేయకుంటే హిందువులు కాదా? అని నెటిజన్లు ఆయనపై మండిపడుతున్నారు.

News November 16, 2025

ప్రపంచ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన ఇషా

image

ప్రపంచ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో హైదరాబాదీ అమ్మాయి ఇషా సింగ్‌ కాంస్యంతో మెరిసింది. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్‌ పిస్టల్‌ విభాగంలో ఇషా 30 పాయింట్లు సాధించి 3వస్థానంలో నిలిచింది. క్వాలిఫికేషన్లో 587 పాయింట్లు సాధించి అయిదో స్థానంతో ఫైనల్‌కు వచ్చిన ఇషా తుదిపోరులో మెరుగైన ప్రదర్శన ఇచ్చింది. ఈ ఛాంపియన్‌షిప్‌లో ఇషాకు ఇదే తొలివ్యక్తిగత పతకం. ఈ ఏడాది ప్రపంచకప్‌ స్టేజ్‌ టోర్నీలో ఆమె స్వర్ణం, రజతం సాధించింది.

News November 16, 2025

పార్టీ పరంగా 42% రిజర్వేషన్లతో ఎన్నికలు?

image

TG: పార్టీపరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి హైకమాండ్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అయితే చట్టపరంగా రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలు జరపాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అటు రిజర్వేషన్లపై హైకోర్టు స్టే, బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో పార్టీపరంగానే వెళ్లే అవకాశం ఉంది. దీనిపై రేపు క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకోనున్నారు.