News July 18, 2024
మోదీకి జగన్ లేఖ.. కేంద్రసంస్థలతో విచారణ జరపాలని వినతి

APలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని జగన్ PM మోదీకి లేఖ రాశారు. ‘నెల రోజుల్లోనే 31 హత్యలు జరిగాయి. 300 మందిపై హత్యాయత్నాలు జరిగాయి. ఏపీలో ప్రభుత్వాన్ని రెడ్ బుక్ రాజ్యాంగంతో పాలిస్తున్నారు. రషీద్ అనే YCP కార్యకర్తను కిరాతకంగా నరికి చంపారు. MP మిథున్ రెడ్డిపైనా హత్యాయత్నంకు ప్రయత్నించారు. YCPని అణచివేయాలన్న లక్ష్యంతోనే దాడులు చేస్తున్నారు. ఈ ఘటనలపై కేంద్రసంస్థలతో విచారణ జరపాలి’ అని కోరారు.
Similar News
News September 3, 2025
సత్యమేవ జయతే: కవిత

TG: ఇవాళ మధ్యాహ్నం బీఆర్ఎస్కు, ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె మరో ట్వీట్ చేశారు. ‘నిజం మాట్లాడినందుకు నాకు దక్కిన బహుమతి ఇదే అయితే.. తెలంగాణ ప్రజల కోసం వంద రెట్లు మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధం. సత్యమేవ జయతే. జై తెలంగాణ’ అని రాసుకొచ్చారు. బీఆర్ఎస్ నుంచి వస్తున్న విమర్శలకు కౌంటర్గానే ఆమె ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.
News September 3, 2025
కవిత.. ఇది పద్ధతి కాదు: నిరంజన్ రెడ్డి

TG: బీఆర్ఎస్ 25 ఏళ్ల ప్రస్థానంలో హరీశ్ రావు పాత్ర మరువలేనిదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. గతంలో హరీశ్ను పొగిడిన వారు, ఇప్పుడు విమర్శిస్తున్నారని చెప్పారు. <<17599925>>కవిత<<>> రివర్స్ గేర్ ఎందుకు తీసుకున్నారో అర్థం కావట్లేదన్నారు. రేవంత్ కాళ్లు మొక్కి హరీశ్ సరెండర్ అయ్యారంటూ నీచమైన ఆరోపణలు చేస్తారా? అని ప్రశ్నించారు. దీని వెనుక ఏం జరిగిందో తెలియట్లేదని, ఇది పద్ధతి కాదన్నారు.
News September 3, 2025
రూ.236.2 కోట్లతో మేడారం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్: సురేఖ

TG: మహా జాతరలోపు మేడారం అభివృద్ధి పనులు పూర్తి చేయాలని మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. రూ.236.2 కోట్లతో మాస్టర్ ప్లాన్ రూపొందించినట్లు చెప్పారు. భక్తుల సందర్శనార్థం అమ్మవార్ల గద్దెల ఎత్తు పెంచాలని పూజారులు ప్రభుత్వం దృష్టికి తీసుకురాగా ఆ మేరకు డిజైన్లు మార్చాలని సూచించారు. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలు ఒకే వరుసలో ఉండేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.