News July 18, 2024
మోదీకి జగన్ లేఖ.. కేంద్రసంస్థలతో విచారణ జరపాలని వినతి

APలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని జగన్ PM మోదీకి లేఖ రాశారు. ‘నెల రోజుల్లోనే 31 హత్యలు జరిగాయి. 300 మందిపై హత్యాయత్నాలు జరిగాయి. ఏపీలో ప్రభుత్వాన్ని రెడ్ బుక్ రాజ్యాంగంతో పాలిస్తున్నారు. రషీద్ అనే YCP కార్యకర్తను కిరాతకంగా నరికి చంపారు. MP మిథున్ రెడ్డిపైనా హత్యాయత్నంకు ప్రయత్నించారు. YCPని అణచివేయాలన్న లక్ష్యంతోనే దాడులు చేస్తున్నారు. ఈ ఘటనలపై కేంద్రసంస్థలతో విచారణ జరపాలి’ అని కోరారు.
Similar News
News January 4, 2026
రేవంత్ నాలుక కోయాలి: హరీశ్ రావు

తెలంగాణ ఏర్పడ్డాక 42 రోజుల్లోనే కృష్ణాలో 69% నీళ్ల కోసం కేంద్రానికి KCR లేఖ రాశారని హరీశ్ రావు తెలిపారు. ‘కాంగ్రెస్, TDP ద్రోహం వల్లే కృష్ణాలో 299 TMCలు వచ్చాయి. కానీ గోదావరిలో 933 TMCలకు మేం అనుమతులు సాధించాం. సభలో అబద్ధాలు చెప్పిన సీఎం రాజీనామా చేయాలి. అబద్ధాలు చెప్పినందుకు రేవంత్ నాలుక కోయాలి. ఇలా మాట్లాడుతున్నందుకు నాపై దాడి చేయించవచ్చు. అవసరమైతే హత్యాయత్నం చేయించవచ్చు’ అని కామెంట్ చేశారు.
News January 4, 2026
ఈ నెలలో స్కూళ్లకు 14 రోజులు సెలవులు

ఏపీలో జనవరిలో స్కూళ్లకు దాదాపు సగం రోజులు సెలవులే ఉంటాయి. ఇవాళ (4), 10-18 తేదీల్లో 9 రోజులు సంక్రాంతి సెలవులు, 23న వసంత పంచమి, 25న ఆదివారం, 26న గణతంత్ర దినోత్సవం. ఇవి అన్ని స్కూళ్లకు వచ్చే 12 సెలవులు. ఇక నగరాల్లోని CBSE సిలబస్, ఇంటర్నేషనల్ స్కూళ్లు శనివారాలూ హాలిడే పాటిస్తున్నాయి. దీంతో వారికి అదనంగా మరో 3 సెలవులు కలిపి ఈ మంత్లో 14 రోజులు హాలిడేస్ అన్నట్లు. తెలంగాణలో ఈ సంఖ్య 10-12 రోజులు.
News January 4, 2026
అఖండ2: OTT డేట్ ప్రకటించిన NETFLIX

బాలకృష్ణ లేటెస్ట్ మూవీ అఖండ2 OTT రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయింది. ముందుగా ఊహించినట్లుగానే ఈనెల 9న మూవీ డిజిటల్ రిలీజ్ ఉంటుందని రైట్స్ పొందిన NETFLIX ప్రకటించింది.


