News August 9, 2024
జగన్ మాస్టర్ ప్లాన్.. విజయం దక్కుతుందా?

AP:విశాఖ స్థానిక సంస్థల MLC ఉపఎన్నికను YCP చీఫ్ జగన్ చాలా సీరియస్గా తీసుకున్నారు. అభ్యర్థి ప్రకటన, YCP ఓటర్లు(MPTC, ZPTC తదితరులు) కూటమి వైపు చూడకుండా క్యాంప్కు తరలించడంలో <<13760321>>చాకచక్యంగా<<>> వ్యవహరించారు. బొత్స సత్యనారాయణను గెలిపించేలా అనుసరించాల్సిన వ్యూహంపై రోజూ నేతలకు సూచనలిస్తున్నారు. అటు TDP కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో AUG 30న జరిగే ఎన్నికల్లో గెలుపెవరిదనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Similar News
News October 30, 2025
అమల్లోకి రాని 8.82 లక్షల కోర్టు తీర్పులు

కోర్టులు వరమిచ్చినా అధికారులు కరుణించలేదన్నట్లు మారింది దేశంలో తీర్పుల అమలు. న్యాయం కోసం దాఖలైన కేసులు 5CRకు పైగా ఉండగా తీర్పులు వచ్చినా అమలు కోసం ఎదురుచూస్తున్న వారు 8.82 లక్షల మంది ఉన్నారు. జిల్లా కోర్టుల్లో పెండింగ్లో ఉన్న ఈ కేసుల్లో 39% MHలో ఉన్నాయి. TN 86148, KL 82997, AP 68137,MP 52219 కేసులున్నాయి. ఈ తీర్పులను ఆరునెలల్లో అమలయ్యేలా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని SC అన్ని HCలను ఆదేశించింది.
News October 30, 2025
నకిలీ మద్యం కేసు: ముగిసిన నిందితుల కస్టడీ

AP: నకిలీ మద్యం కేసులో జనార్దన్, జగన్మోహనరావు కస్టడీ ముగియగా VJA కోర్టులో హాజరుపరిచారు. ఇద్దరి స్టేట్మెంట్లను అధికారులు న్యాయస్థానానికి సమర్పించారు. జోగి రమేశ్ చెబితేనే నకిలీ మద్యం తయారు చేశానని జనార్దన్ రావు చెప్పగా ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్లు సమాచారం. అందుకు సంబంధించిన ఆడియో, వీడియో సైతం కోర్టుకు ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరిద్దరినీ 7 రోజుల పాటు ఎక్సైజ్, సిట్ అధికారులు ప్రశ్నించారు.
News October 30, 2025
సెంచరీ భాగస్వామ్యం.. ఉత్కంఠగా మ్యాచ్

WWCలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచులో టీమ్ఇండియా బ్యాటర్లు జెమీమా రోడ్రిగ్స్(81*), హర్మన్ ప్రీత్(66*) అర్ధసెంచరీలు చేశారు. 59 పరుగులకే ఓపెనర్లు ఔటవ్వగా వీరిద్దరు సెంచరీ భాగస్వామ్యంతో జట్టును పటిష్ఠ స్థితిలోకి చేర్చారు. ప్రస్తుతం భారత్ స్కోరు 198/2. విజయానికి ఇంకా 19 ఓవర్లలో 141 పరుగులు చేయాల్సి ఉంది. ఎలాగైనా ఈ మ్యాచులో భారత్ గెలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.


