News July 18, 2024

వైసీపీ నేతలతో జగన్ సమావేశం

image

AP: వైసీపీ నేతలతో మాజీ సీఎం జగన్ అత్యవసర సమావేశం నిర్వహించారు. బెంగళూరు పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని తాడేపల్లికి వచ్చిన ఆయన.. అందుబాటులో ఉన్న నేతలతో భేటీ అయ్యారు. పల్నాడు జిల్లాలో వైసీపీ కార్యకర్త హత్య, చిత్తూరు జిల్లా పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి పర్యటనలో రాళ్ల దాడి ఘటనలపై చర్చిస్తున్నట్లు సమాచారం. కాగా రేపు జగన్ వినుకొండ వెళ్లనున్నారు. హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శిస్తారు.

Similar News

News October 23, 2025

మేడ్చల్ ఘటనపై బండి సంజయ్ ఫైర్

image

TG: గోరక్షాదళ్ సభ్యుడు సోనూసింగ్‌పై <<18077269>>దాడిని<<>> కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఖండించారు. ఎంఐఎం రౌడీలకు కాంగ్రెస్ ఆశ్రయం ఇస్తే ఇలాంటి ఘటనలే జరుగుతాయని ధ్వజమెత్తారు. గోభక్తులపై దాడులకు పాల్పడే సంఘ విద్రోహ శక్తులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. మరోవైపు దాడిని వ్యతిరేకిస్తూ ఇవాళ డీజీపీ ఆఫీసు ఎదుట నిరసన చేపట్టనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్ రావు తెలిపారు.

News October 23, 2025

అక్టోబర్ 23: చరిత్రలో ఈరోజు

image

1922: రచయిత అనిశెట్టి సుబ్బారావు జననం
1923: మాజీ ఉపరాష్ట్రపతి బైరాన్‌సింగ్ షెకావత్ జననం
1979: సినీ హీరో ప్రభాస్ జననం
1991: హీరోయిన్ చాందిని చౌదరి జననం
2007: ప్రముఖ తెలుగు కవి ఉత్పల సత్యనారాయణాచార్య మరణం
2023: భారత మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడి మరణం

News October 23, 2025

ఆస్ట్రేలియన్ ప్లేయర్ రికార్డు సెంచరీ

image

ఆస్ట్రేలియన్ ప్లేయర్ గార్డ్‌నర్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. WWCలో అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన ప్లేయర్‌గా నిలిచారు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచులో 69 బంతుల్లోనే 15 ఫోర్లతో శతకం బాదారు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసింది. ఛేదనలో గార్డ్‌నర్(104*), అన్నాబెల్(98*) విజృంభించడంతో ఆస్ట్రేలియా 40.3 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.