News July 18, 2024
వైసీపీ నేతలతో జగన్ సమావేశం

AP: వైసీపీ నేతలతో మాజీ సీఎం జగన్ అత్యవసర సమావేశం నిర్వహించారు. బెంగళూరు పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని తాడేపల్లికి వచ్చిన ఆయన.. అందుబాటులో ఉన్న నేతలతో భేటీ అయ్యారు. పల్నాడు జిల్లాలో వైసీపీ కార్యకర్త హత్య, చిత్తూరు జిల్లా పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి పర్యటనలో రాళ్ల దాడి ఘటనలపై చర్చిస్తున్నట్లు సమాచారం. కాగా రేపు జగన్ వినుకొండ వెళ్లనున్నారు. హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శిస్తారు.
Similar News
News November 18, 2025
ప్రీ మెచ్యూర్ బేబీలకు ఈ సమస్యల ముప్పు

నెలలు నిండక ముందే పుట్టినవారు చాలా సున్నితంగా ఉంటారు. కంటికి రెప్పలా జాగ్రత్తగా కాపాడుకోవాలంటున్నారు నిపుణులు. ముందే పుట్టడం వల్ల వీరికి కంటి సమస్యలు, వినికిడి లోపం, శ్వాస, మెదడు సమస్యలు, గుండె జబ్బులు, నరాలు, జీర్ణశయాంతర సమస్యలు వంటి దీర్ఘకాలిక ఆరోగ్య ప్రమాదాలు వచ్చే ప్రమాదం ఎక్కువ. పుట్టినప్పుడు వారి అవయవాలు పూర్తిగా అభివృద్ధి చెందకపోవడమే దీనికి కారణమని చెబుతున్నారు.
News November 18, 2025
ప్రీ మెచ్యూర్ బేబీలకు ఈ సమస్యల ముప్పు

నెలలు నిండక ముందే పుట్టినవారు చాలా సున్నితంగా ఉంటారు. కంటికి రెప్పలా జాగ్రత్తగా కాపాడుకోవాలంటున్నారు నిపుణులు. ముందే పుట్టడం వల్ల వీరికి కంటి సమస్యలు, వినికిడి లోపం, శ్వాస, మెదడు సమస్యలు, గుండె జబ్బులు, నరాలు, జీర్ణశయాంతర సమస్యలు వంటి దీర్ఘకాలిక ఆరోగ్య ప్రమాదాలు వచ్చే ప్రమాదం ఎక్కువ. పుట్టినప్పుడు వారి అవయవాలు పూర్తిగా అభివృద్ధి చెందకపోవడమే దీనికి కారణమని చెబుతున్నారు.
News November 18, 2025
ప్రీ మెచ్యూర్ బేబీల సంరక్షణ ఇలా..

ప్రీమెచ్యూర్ బేబీల సంరక్షణలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి పాలు పట్టడంతో పాటు బర్పింగ్ చేయించడం చాలా ముఖ్యం. సరైన నిద్ర కోసం అనువైన వాతావరణం సృష్టించాలి. వారికి స్నానానికి బదులు స్పాంజ్ బాత్ చేయించాలి. వీరికి ఇన్ఫెక్షన్ల ముప్పూ ఎక్కువే. అలాగే వీరికి ఆరు నెలలు వచ్చేవరకు ప్రయాణాలు కూడా సురక్షితం కాదని నిపుణులు చెబుతున్నారు. ఒక థర్మామీటర్, నెబ్యులైజర్ అందుబాటులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు.


