News April 4, 2024

నాయుడుపేటలో నేడు జగన్ బహిరంగ సభ

image

AP: CM జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 8వ రోజు చిత్తూరు జిల్లాలో కొనసాగనుంది. గురవరాజుపల్లె నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. చిన్నసింగమలలో ఉ.11గంటలకు లారీ, ఆటో డ్రైవర్లతో సీఎం జగన్ సమావేశమవుతారు. మధ్యాహ్నానికి యాత్ర నెల్లూరు జిల్లాలోకి ప్రవేశిస్తుంది. నాయుడుపేటలో బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. అనంతరం గూడూరు బైపాస్, నెల్లూరు బైపాస్ మీదుగా చింతరెడ్డిపాలెం చేరుకుని రాత్రికి అక్కడ బస చేస్తారు.

Similar News

News February 2, 2026

‘పవార్ ప్లే’ మళ్లీ మొదలవుతుందా?

image

మహారాష్ట్ర Dy.CM, NCP చీఫ్ అజిత్ పవార్ అకాల మరణంతో ఆ రాష్ట్ర రాజకీయాల్లో గ్యాప్ ఏర్పడింది. దీనిని భర్తీ చేసేందుకు బాబాయ్ శరద్ పవార్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. చీలిపోయిన NCPని మళ్లీ కలిపేందుకు కృషి చేస్తూనే బారామతి, పుణే వంటి పవార్ల కంచుకోటలపై పట్టుసడలకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న పవార్ ఇప్పుడు యాక్టివ్ అవడం ‘మహా’ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

News February 2, 2026

కుసుమలో పేనుబంక, శనగపచ్చ పురుగు నివారణ

image

రబీ సీజన్‌లో సాగు చేస్తున్న కుసుమ పంట పూత దశలో పేనుబంక తెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. దీని నివారణకు లీటరు నీటికి డైమిథోయేట్ 2ML లేదా ఎసిఫేట్ 1.5గ్రాములను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కుసుమను శనగపచ్చ పురుగు ఆశిస్తే దీని నివారణకు లీటరు నీటిలో క్లోరోపైరిఫాస్ 25 ఇసి 2.5ML లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములను కలిపి పిచికారీ చేయాలి.

News February 2, 2026

ఆడపిల్లలు గడపపై కూర్చుకూడదా?

image

ఇంటి ప్రధాన ద్వారం గడపను లక్ష్మీదేవి నివాసస్థానంగా భావిస్తారు. అందుకే గడపపై ఆడపిల్లలు కూర్చోవడం లక్ష్మీదేవిని అగౌరవ పరిచినట్లవుతుందని పండితులు చెబుతున్నారు. దీనివల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశించి, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, కుటుంబ కలహాలు తలెత్తే అవకాశం ఉంది. గడపపై కాలు పెట్టడం వల్ల కూడా లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై ఇల్లు వీడుతుందని నమ్మకం. ఇంటి పురోగతిని కోరేవారు ఇలాంటి పనులు చేయకూడదు.